Connect with us

Featured

TDP Politics : ఇటు నారాయణ.. అటు అశోక్ గజపతి రాజు.. చంద్రబాబు లెక్క కరెక్టేనా? సర్వేలు ఏం చెబుతున్నాయ్?

Published

on

TDP Politics : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలు రెండింటినీ అలెర్ట్ చేశాయి. దీంతో పార్టీలు రెండూ ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. ఓ పార్టీ అయితే ఏకంగా పార్టీకి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో మునిగిపోయింది. ఈ విషయంలో టీడీపీ ముందుంది అనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన జోష్‌తో టీడీపీ దూసుకెళుతోంది. ఎన్నికలకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

వందకు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిందని కూడా టాక్ నడుస్తోంది. అయితే రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మాత్రం ఇప్పటికే ప్రకటించేసింది. ఆ ఇద్దరు ఎవరు? అధినేత చంద్రబాబు లెక్క కరెక్టేనా? లేదంటే సింపతీ కోణంలో ఆలోచించి తప్పులో కాలేస్తున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం మాదిరిగానే ఈ నిర్ణయం కూడా పార్టీకి కలిసొస్తుందా? తదితర విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

తీవ్ర మానసిక వేదనకు గురైన నారాయణ..

నెల్లూరు సిటీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థిని ఖరారు చేశారు . నెల్లూరు సిటీ నుంచి ఈ సారి మాజీ మంత్రి పొంగూరు నారాయణ బరిలోకి దిగుతారని వెల్లడించారు. ఇక విజయనగరం నుంచి అశోక్‌ గజపతి రాజు సైతం బరిలోకి దిగుతారని ప్రకటించారు. టీడీపీ నుంచి ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ ముందుగా బయటకు వచ్చిన పేర్లు మాత్రం వీరిద్దరివే. గత కొంతకాలంగా నారాయణ ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటూ వస్తున్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీలో ఆయన పాత్ర ఉందని జైలుకు పంపించడం.. ఆపై ఆయనతో పాటు ఆయన కుటుంబంపై సీఐడీ రైడ్స్.. వంటి వాటి కారణంగా ఆయనకు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈసారి పోటీకి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నారాయణను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను సర్వే చేయించానని.. భారీ ఆధిక్యంతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయన్న చంద్రబాబు చెప్పడంతో ఆయన సైతం పోటీకి ఓకే చెప్పినట్టు సమాచారం.

Advertisement

మాన్సాస్ ట్రస్ట్ నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు..

ఇక పూస‌పాటి అశోక్ గజపతి రాజు పరిస్థితి కూడా నారాయణకు ఏమీ భిన్నంగా లేదు. ఆయన విజ‌య‌న‌గ‌ర రాజ వంశానికి చెందిన వారు. ఆయ‌న న‌రేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమాన‌యాన శాఖా మంత్రిగా ప‌ని చేశారు. అశోక్ గ‌జ‌ప‌తి రాజు 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. ఏపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల పాటు మంత్రిగా ప‌ని చేశారు. అలాంటి అశోక్ గజపతిరాజును వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు సృష్టించింది. మాన్సాస్, సింహాచలం ట్రస్టు చైర్‌ పర్సన్‌గా అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టుకు వెళ్లడం.. ఆయనకు సానుకూలంగా తీర్పు రావడం వంటివి జరిగాయి. మాన్సాస్ ట్రస్టు పరిధిలోనే సింహాచలంతోపాటు 108 ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా మాన్సాస్ ట్రస్ట్‌కు భూములున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే జీవో నెం.72 అనేది సంచలనంగా మారింది. మొత్తానికి ఇటీవలి కాలంలో పరిస్థితులన్నీ చక్కబడి ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.

మరి చంద్రబాబు లెక్క కరెక్టేనా?

మరి అశోక్ గజపతిరాజు, నారాయణలను అసెంబ్లీకి పంపాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సబబేనా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి 2019 ఎన్నికలకు ముందు మాత్రం నారాయణపై చాలా విమర్శలు వచ్చాయి. చివరకు ఆయన కుమారుడు యాక్సిడెంట్‌లో మరణిస్తే కూడా జనం ఒకరకంగా సింపతీ చూపలేని పరిస్థితి. ఎందరో పేద కుటుంబాల నుంచి నిర్ధాక్షిణ్యంగా ఫీజులు వసూలు చేశారని.. ఎందరినో విద్యార్థులను నారాయణ కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందంటూ విమర్శలు వచ్చాయి. ఆ పాప ఫలితమే ఆయన కుమారుడిని పోగొట్టుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయనపై పెద్దగా విమర్శలైతే ఏమీ లేవు. తరచూ ప్రభుత్వ వేధింపులకు గురవడం కారణంగా సింపతీ అయితే వచ్చి ఉండొచ్చు కూడా. ఇక అశోక్ గజపతి రాజుకు కూడా అంతే. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆయనకు పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. చంద్రబాబు సర్వేలు నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు.

హాట్ టాపిక్‌గా నెల్లూరు..

Advertisement

ముఖ్యంగా రాజధాని అమరావతికి అవసరమైన భూముల సేకరణలో నారాయణ కీలక పాత్ర పోషించారు. రాజ రైతులను ఒప్పించి వారి నుంచి భూములు సేకరించారు. అంతేకాకుండా సీఆర్డీఏ రూపకల్పనలోనూ ఆయన కృషి చాలా ఉందనే చెప్పాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణను ఇరుకున పెట్టే నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ నారాయణపై కేసు నమోదు చేసింది. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కూడా ఆయన తప్పక బరిలో నిలుస్తారు. అయితే అనిల్‌పై వ్యతిరేకత బాగానే ఉందని సమాచారం. ఇవన్నీ నారాయణకు కలిసొస్తాయని చంద్రబాబు లెక్కలేస్తున్నారు. ఇటు నారాయణ, అటు అశోక్ గజపతి రాజు.. మొత్తానికి చంద్రబాబు గట్టి స్కెచ్చే వేశారు. ఇక టీడీపీ తరపున నారాయణ బరిలోకి దిగుతుండడంతో నెల్లూరు నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారడం ఖాయం.

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!