కరోనా ఉదృతి నేపధ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ సీఎం కెసిఆర్. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు సూచించారు.

ప్రజల ఆరోగ్యం కోసమే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని ఈ సందర్బంగా అయన తెలిపారు. మరోవైపు టీకాలపై మాట్లాడుతూ రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలనీ, బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీ ఆసుపత్రిలో 150 బెడ్లు, ENT ఆసుపత్రిలో మరో 250 బెడ్లు ఉన్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు.



























