తెలంగాణలో కరోనా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగ వాటిలో 609 మందికి పాజిటివ్గా నమోదైంది. నలుగురు మృతిచెందారు. ఇక పాజీటివ్ వచ్చిన వారిలో 647 మంది కోలుకున్నారు.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మెుత్తం 6,34,018 ఉండగా 3,811 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారిగా యాక్టివ్ కేసులు సంఖ్యను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 81 కేసులు ఉండగా.. కరీంనగర్లో 67, ఖమ్మంలో 51, నల్గొండలో 48, వరంగల్ అర్బన్లో 41, పెద్దపల్లిలో 39, రంగారెడ్డిలో 36, మేడ్చల్లో 36 కేసులు ఉన్నాయి.



























