బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సిద్ధమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఈసారి కొత్త కాన్సెప్ట్లతో రాబోతుంది. ముఖ్యంగా, తొలిసారిగా సాధారణ ప్రేక్షకులకు కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు “బిగ్ బాస్ అగ్నిపరీక్ష” అనే ప్రీ-సీజన్ ఈవెంట్ను నిర్వహించనున్నారు.

అగ్నిపరీక్షలోకి అనూషా రత్నం
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం ఇప్పటికే వివిధ రంగాల నుంచి 40 మందిని ఎంపిక చేసి, వారిలో నుంచి 15 మందిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలో అనూషా రత్నం అనే పేరు బాగా వినిపిస్తోంది. వరంగల్కు చెందిన అనూషా ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత జాబ్కు రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఆమె పేరు మరింత హాట్ టాపిక్గా మారింది.
సెప్టెంబర్ 7న గ్రాండ్ ప్రీమియర్?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ 7న లేదా సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష మాత్రం ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్స్టార్లో ప్రసారం అవుతుందని తెలుస్తోంది. ఈ అగ్నిపరీక్షకు హోస్ట్గా శ్రీముఖి వ్యవహరించనుండగా, మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్లు జడ్జిలుగా ఉంటారని సమాచారం. ఈ అగ్నిపరీక్షలో విజేతలు ప్రధాన బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశిస్తారు.
ఈసారి సామాన్యులు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారనడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





























