ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో దీని ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో ఈ మహమ్మారి నుంచి విముక్తి కలిగించేందుకు తుది దశ ప్రయోగాలూ జరుగుతున్నాయి.

ఈనేపధ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రోజుకు 10 లక్షల మంది చొప్పున వారానికి 70 లక్షల మందికి కరోనా టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 10 వేల మంది anmలు, నర్సులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ప్రతిఒక్కరు రోజుకు 100 మందికి తగ్గకుండా టీకాలు ఇచ్చేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు తెలంగాణా సర్కార్ రంగం సిద్దం చేస్తోంది. అయితే ముందుగా రాష్ట్రంలోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు టీకాలు ఇవ్వనున్నారు. వీరిలో 3 లక్షల మంది డాక్టర్లు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, వృద్దులకు వ్యాక్షిన్ ఇవ్వనున్నారు.



























