తెలంగాణలో మే 1 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్ధులు రాష్ట్రంలో పరీక్షలు రాయాల్సి ఉండగా.. పరీక్షాకేంద్రాలు మరియు పరీక్షా కేంద్రాలకు వచ్చే సమయంలో బౌతికదూరం పాటించడం కష్టం అవుతుందని అధికార వర్ఘాలు భావిస్తున్నాయి.

మరోవైపు కేవలం 40 రోజులు మాత్రమె ప్రత్యక్ష తరగతులు జరిపి పరీక్షలు నిర్వహించడంపై విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్న నేపధ్యంలో మరో 10 రోజులలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.





























