మనసు మమత సీరియల్ లో తన నటన ద్వారా అందరిని అలరించిన నటి శ్రావణి సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. లవ్ ఫెయిల్యూర్ కారణంగానే ఆమె సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రి హైదరాబాద్, మధురానగర్లో తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. మనసు మమత, మౌనరాగం వంటి సీరియల్స్లో శ్రావణి నటించారు. అయితే నటి శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ మధ్యకాలంలో తరచూ ఇలా సినీ, టీవీ నటులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో నటి శ్రావణి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదని తెలుస్తుందో. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పోస్ట్మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా అసలు విషయం తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.



























