Connect with us

Featured

Thammareddy Bharadwaj : సిల్క్ స్మిత తో కృష్ణ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు… బాబు మోహన్ కోసం అలా చేస్తావా అని సినిమా సెట్స్ నుండి వెళ్లిపోయారు… సంవత్సరం జైల్లో పెట్టించాను…: తమ్మారెడ్డి భరద్వాజ

Published

on

Thammareddy Bharadwaj : తెలుగు సీనియర్ నిర్మాత మరియు దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుంది. తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలను తీసారు. ఇక తమ్మారెడ్డి అనగానే కృష్ణా గారితో తీసిన పచ్చని సంసారం సినిమా గుర్తొస్తుంది. అయితే ఆ సినిమా తరువాత కృష్ణ గారితో చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమా ప్లాన్ చేసారు. అదే రౌడీ అన్నయ్య. రౌడీ అన్నయ్య సినిమా కథ భరద్వాజది కాదు కృష్ణ గారే భరద్వాజకు ఒకరి దగ్గర మంచి కథ ఉంది సినిమా చేద్దామని చెప్పడంతో కథ తీసుకోడానికి వెళితే ఆయనే దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారు.

సిల్క్ స్మితతో పాటలో కృష్ణ గారి పై కుట్ర…

ఇక సినిమా మొదలైనప్పటి నుండి సిల్క్ స్మిత పాట విషయంలో కృష్ణ గారితో వివాదం మొదలయింది. క్లైమాక్స్ లో సిల్క్ స్మిత పాట ఉంటుందని డిజైన్ చేశారట. కానీ పాట బాబు మోహన్ తో ఉండాలని తమ్మారెడ్డి భావించారు. కానీ కృష్ణ గారు చివర్లో వచ్చే పాటలో నేను లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరని వాదించారు. ఇక సినిమా షూటింగ్ అంతా పూర్తి అయినా పాటను మాత్రం పెండింగ్ పెట్టారట. చివరకు నిర్మాతతో కలిసి ఒక ప్లాన్ చేసారు తమ్మారెడ్డి.

Advertisement

పగలు కృష్ణ… రాత్రి బాబు మోహన్ తో సిల్క్ స్మిత పాట…

ఇక కృష్ణ గారితో పగలు సిల్క్ స్మిత పాట షూట్ చేసారు. ఆయనకు తెలియకుండా రాత్రికి బాబూమోహన్ తో పాటను షూట్ చేసారు. ఈ విషయం కృష్ణ గారికి తెలియకుండా మేనేజ్ చేసారు దర్శక నిర్మాతలు. అయితే సెన్సర్ విషయంలో పాటను తీసేయాలని చెప్పడంతో కృష్ణ గారే స్వయంగా సెన్సర్ బోర్డు మెంబెర్ సుబ్బిరామిరెడ్డిపై ఫైర్ అయ్యారట. తీరా చూస్తే పాటలో కృష్ణ గారికి బదులుగా బాబూమోహన్ ఉండటంతో కృష్ణ గారికి బాగా కోపం వచ్చినా చాలా హుందాగా తమ్మారెడ్డి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్ షిప్ ఎండ్ అయింది బాగా చేసావ్ అని అన్నారట. ఆ తరువాత ఆ పాటను మళ్ళీ మూడో సారి కృష్ణ గారే స్వయంగా డైరెక్టర్ చేసారు. కానీ ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మాత్రం తమ్మారెడ్డి ఆఫీస్ పై దాడి చేయడం ఆ తరువాత తమ్మారెడ్డి కేసు పెట్టడం వంటి రచ్చ ఒక సంవత్సరం పాటు కొనసాగింది. ఆ తరువాత తమ్మారెడ్డి గారు కృష్ణ గారితో మళ్ళీ కలిశారట. అలా కృష్ణ గారితో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు తమ్మారెడ్డి. అయితే ఆరోజు కృష్ణ గారే కరెక్ట్ ఒక మాస్ హీరో అయినా కమెడియన్ తో డాన్స్ ఏంటి అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది లో బ్రహ్మానందంతో డాన్స్ చేసారు, ఆ సన్నివేశం చూసినపుడు నాకు నా తప్పు అర్థమైందని చెప్పారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!