Thammareddy Bharadwaja : రాజ్యసభ నామినేటెడ్ పదవులకు సినిమా రంగం నుండి విజయేంద్ర ప్రసాద్, అలాగే ఇళయరాజా గారిని ఎంపిక చేయడం జరిగింది. సినిమా రంగం నుండి ఇద్దరిని తీసుకోవడంతో ఫిలిం ఇండస్ట్రీ ఆనందంలో ఉంది. ఇక స్వయంగా ప్రధాన మంత్రి ఫోన్ చేసి రాజ్యసభకు ఎన్నికైన వారిని అభినందించారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకు నామినేట్ అవ్వడంతో ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

కోడిగుడ్డు మీద ఈకలెందుకు పీకడం…
విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్ గా భజరంగి భాయిజాన్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, మెర్సెల్, మణికర్ణిక వంటి సినిమాలకు కథ అందించారు. ఇక రాజన్న సినిమాకు దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభకు నామినేట్ అవ్వడం గురించి తమ్మారెడ్డి గారు స్పందిస్తూ ఆయనను అభినందించారు. తెలుగు ఇండస్ట్రీ నుండి రాజ్యసభ కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక వేరే వాళ్లకు ఇవ్వకుండా విజయేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని ఇంటర్వ్యూలో ఆయనను అడుగగా వివాదాల జోలికి పోకండి, ఒక తెలుగు వ్యక్తికి వచ్చినందుకు ఆనందించండి ‘కోడి గుడ్డు మీద ఈకలెందుకు పీకాలని‘ అంటూ వాఖ్యణించారు.

ప్రతి విషయాన్ని సమీక్షించాల్సిన పని లేదు అంటూ హితవు చెప్పారు. ఇక టికెట్ రేట్లు, ఆచార్య సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం గురించి మాట్లాడుతూ అది నాకే కాదు ఇండస్ట్రీ లో ఎవరికీ అంతు పట్టని విషయం. ఇద్దరు పెద్ద హీరోలు ఒక పెద్ద డైరెక్టర్ సినిమా కు కనీసం ఓపెనింగ్స్ వస్తాయి సినిమా ఎలా ఉన్నా కానీ అది కూడా రాలేదంటే అర్థమవడం లేదు అంటూ వాఖ్యణించారు. టికెట్ రేట్లు పెరగడం, సినిమా ఓటీటీ లో వెంటనే రావడం వల్ల సినిమాలకోసం థియేటర్లకు జనాలు వెళ్లడం తగ్గిందని అభిప్రాయపడ్డారు.
































