Connect with us

Featured

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

Published

on

Pooja Hegde: అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తరువాత ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో అందరు ఐరన్ లెగ్ అంటూ ఈ అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ట్రోలింగ్స్ పై పూజ స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తన కెరీర్ లో ఉన్న హిట్టు, ప్లాప్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

Pooja Hegde: ఆ సినిమా వల్లే నా పై ఆ ముద్ర పడింది..నేను నటించిన చెత్త సినిమా అదే?

ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.. నేను తెలుగులో నటించిన 6 సినిమాలు వరుసగా హిట్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తన కెరీర్ లో ఉన్న ప్లాప్ ల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పూజ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్లాప్ సినిమా మొహంజొదారో . నేను నటించిన సినిమాలలో చెత్త సినిమా ఇది. ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవ్వటంతో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అంటూ చెప్పుకొచ్చింది.

ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది…

ఈ సినిమా వల్ల ఏడాది పాటు నాకు సినిమా ఆఫర్లు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజాహెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈథ్‌ కభీ దివాలీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన” సినిమాలో నటించనుంది. అంతే కాకుండా పాన్ ఇండియా హీరో యశ్ సరసన నటిస్తూ కన్నడలో కూడా అడుగు పెట్టనుంది.

Advertisement

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: నెల్లూరు జైలుకు వైయస్ జగన్.. ఆ వైసీపీ నేతతో మూలఖత్?

Published

on

YS Jagan: వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 4వ తేదీ నెల్లూరు జైలుకు వెళ్లబోతున్నారు. నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే పిల్లలతో ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు మూలాఖత్ అయ్యారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో విజయం తమదేనని చాలా ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు ఊహించిన విధంగా రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ విషయం నుంచి ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారని తెలుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తిరిగి పరామర్శించడానికి అలాగే ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని కేడర్ కి సూచించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా తెలిపారు.

Advertisement

పిన్నెల్లితో మూలాఖత్…

ఇక త్వరలోనే తాను ప్రజలలోకి రాబోతున్నానని జగన్ వెల్లడించారు. ఈ తరుణంలోనే ముందుగా అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈయన పరామర్శించబోతున్నారు. ఇన్ని రోజులపాటు బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లికి చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాడేపల్లి నుంచి నేరుగా నెల్లూరుకు హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జైలుకు వెళ్లబోతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!