Pushpa: పుష్ప 2 రూమర్లపై స్పందించిన మేకర్స్.. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే?
Pushpa: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విధంగా పుష్ప సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక ఈ సినిమా అద్భుతమైన హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పుష్ప సీక్వెల్ చిత్రం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పై కోపంతో రౌడీలు శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మికను చంపేస్తారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తపై నిర్మాత రవిశంకర్ స్పందిస్తూ ఈ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు.ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక చనిపోతుందని అలాగే కొందరి పాత్రల గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు.
ఇప్పటివరకు కథను మేము ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా వినలేదు.ఈ సినిమా గురించి ఎవరికీ ఏమీ తెలియదు కనుక ఏ సినిమా గురించి ఏ విధమైనటువంటి వార్తలు వచ్చినా తొందరగా నమ్ముతున్నారు. అయితే శ్రీవల్లి పాత్ర గురించి వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఈయన ఆ వార్తలను కొట్టిపారేశారు ఇదే విషయాన్ని పలు న్యూస్ ఛానళ్లు వెబ్ మీడియా కూడా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…