Thottempudi Venu : వేణు… తెలుగులో వెంకటేష్ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గర అయిన హీరో. 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. చిరినవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో అభిమానులకు మరింత దగ్గర అయ్యాడు. 2013 లో వచ్చిన ‘రామాచారి’ సినిమా తరువాత సినిమాలకు దూరంగా అమెరికా లో స్థిరపడిన వేణు తాజాగా రవితేజ హీరోగా వచ్చిన’ రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ద్వారా మరోసారి అభిమానులను పలకరించాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

జగపతి బాబును నమ్మి చాలా నష్టపోయాను…
రామారావు ఆన్ డ్యూటీ సినిమా తరువాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వేణు తన కెరీర్ లో జరిగిన చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జగపతి బాబు గారితో రిలేషన్ గురించి ప్రస్తావించగా, అయన చాలా మంచి మనిషి అని తనతో రెండు సినిమాలు చేశానని చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పారు. అయితే అయన వళ్ళ డబ్బులు పోగొట్టుకున్నానని చెప్పారు. ఎవరిగురించో నాది హామీ అని మధ్యలో వచ్చి డబ్బు ఇప్పించారు. అవి ఇంతవరకూ నాకు రాలేదు. ఆ తరువాత జగపతి బాబు కూడా ఇపుడు నన్ను పలకరించలేదు. అప్పట్లో నాకు అది పెద్ద అమౌంట్ అని చెప్పుకోచ్చారు.

ఇక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, జీవితంలో అతి కష్టమైన పని అంటే హౌస్ వైఫ్ అని చెప్పారు. తన భార్యని, అమ్మని చూసాక నాకు అర్థం అయింది ఇదే అని అయన చెప్పుకొచ్చారు. నా భార్య బాగా చదువుకున్న తన కెరీర్ ని పక్కన పెట్టి ఎపుడూ పిల్లలకు అందుబాటులో వుండి పిల్లలకు ఏం కావాలో చూసుకుంటుంది అని చెప్పారు.



























