కర్టాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్రకు వేలాది జానాలు తరలివచ్చారు. ప్రస్తుతం అతడి యాత్రకు సంబంధించి వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అతడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

బళ్లారిలోని హడగలికి చెందిన బసవ అలియాస్ పుచ్చ భాత్స్య అనే యాచకుడితో అక్కడి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. బసవకు భిక్షం పెడితే మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే చాలామంది అతడిని పిలిచి మరీ అన్నదానం చేసేవారు. ఆయన ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. బసవ అంతిమయాత్రకు వేలాది మంది హాజరై తుది వీడ్కోలు పలికారు.
సాధారణంగా ప్రముఖులు మరణిస్తేనే అలాంటి జానల్ని మనం అంతిమయత్రలో చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం వేరేవిధంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. కొత్తగా ఆప్రాంతానికి వచ్చిన వారు ఇలా అంటున్నారు..‘‘అంతమంది అంతిమయత్రకు వచ్చారు.. ఎవరైనా ప్రముఖులు చనిపోయారా’’.. అంటూ పక్కవారిని అడగడం విశేషం.
కాదు అతడు ఒక యాచకుడు అని చెప్పగానే వాళ్లకు ఆశ్చర్యంతో పాటు.. అలా ఎలా అనే విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా పెరిగింది. అయితే దీనిపై నటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి దగ్గర ఏమైనా రూ.కోట్లు ఉన్నాయేమో అని చాలా మంది అనుకున్నారు కానీ.. అతడిపై ఉన్న మమకారం.. గౌరవం, నమ్మకంతోనే వాళ్లంతా అంతిమయాత్రకు వచ్చారు. ఏదేమైనా.. సొంత బంధువులు చనిపోతేనే అంతియ యాత్రకు పోలేని ఈ రోజుల్లో.. ఒక యాచకుడి అంతిమయాత్రకు అంతమంది వెళ్లడం అనేది చెప్పుకోదగిన విషయమే.






























