Tirumala: కలియుగ దైవం, ఏడుకొండల వాడు… వడ్డీ కాసుల వాడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగిందని విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆపద మొక్కుల వాడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇలా భక్తుడు ఏకంగా స్వామివారి హుండీలో దొంగతనం చేయడం పట్ల భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఘటన నవంబర్ 23వ తేదీ జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిత్యం స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది తిరుమలకు చేరుకుంటారు. కొండపై నిత్యం గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఇలాంటి ఆలయంలో భక్తుడిగా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి స్వామివారి దర్శనం కోసం వెళ్లారు అయితే ఈయన హుండీలో నుంచి 15000 రూపాయలను దొంగలించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది.
ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ పారిపోయాడని సీసీ కెమెరా మానిటరింగ్ చేస్తున్న జ్ఞానేంద్ర అనే ఆపరేటర్ గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వెంటనే అతనిని ట్రేస్ చేసి నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు అరెస్టు చేయడమే కాకుండా తమదైన శైలిలోనే విచారణ చేయడంతో దొంగలించిన 15 వేల రూపాయలను తిరిగి వెనక్కి ఇచ్చారు.

Tirumala: 15 వేలు…
ఇక ఈ విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనగా మారింది. ఓ భక్తుడు స్వయంగా హుండీలో డబ్బులను చోరీ చేస్తుంటే అక్కడ భద్రత చర్యలు ఎలా ఉన్నాయో స్పష్టం అవుతుందని భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు.




























