జూలై 23వ నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభంకానుంది. అయితే ఆ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు లక్షా 50 వేల కండోమ్లు సిద్ధం చేసారు నిర్వాహకులు. ఒలింపిక్స్ విలేజ్లో బస చేసే అథ్లెట్లకు ఆ కండోమ్లను పంచనున్నారు నిర్వాహకులు.

అయితే ప్రస్తుతం కరోనా నేపద్యంలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు అమలులో ఉన్నందున అథ్లెట్స్ కండోమ్లను ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే వాటిని తమ ఇంటికి ( సొంత దేశాలకు) తీసుకెళ్లొచ్చని తెలిపారు. కాగా.. 1988 నుంచి ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్లను పంపిణీ చేయడం సాప్రదాంగా మారిపోయింది. అప్పటి నుంచి హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అథ్లెట్లకు కండోమ్లను ఇవ్వడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది.



























