ఆరడుగుల ఆజానుబాహుడు కంచుకంఠం,మంచి ముఖవర్చస్సు ఉన్న పుడిపెద్ది జోగేశ్వర శర్మ(పి.జె.శర్మ) తెలుగువాడైన కొన్ని కారణాల వలన 1950 ప్రాంతంలోనే మద్రాస్ వలస వెళ్లారు. ఒడ్డు పొడుగు ఉన్న శర్మ అడపాదడపా తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రత్యేకంగా బ్రేక్ ఇచ్చిన సినిమా అంటూ ఏదిలేదు. అలా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. అలా కొన్ని ఆర్థిక ఇబ్బందులతో నడుస్తున్న కుటుంబానికి పి.జె.శర్మ పెద్ద కుమారుడైన సాయి కుమార్ తరంగిణి సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేయడంతో కుటుంబ పోషణకు కొంత చేదోడువాదోడుగా ఉన్నాడు.
పి.జె.శర్మ రెండవ కుమారుడు రవిశంకర్ సినిమాల్లో గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆలోచనతో తల్లి కృష్ణ జ్యోతి రవిశంకర్ కు యాక్టింగ్, డాన్స్, సంగీతం హార్స్ రైడింగ్ వంటి అనేక కళల్లో శిక్షణ ఇప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి అంత ఎత్తుకు ఎదగాలని ఆమె రవిశంకర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లి కృష్ణ జ్యోతి చనిపోకముందు డైరీ రాస్తుండేవారని ఆమె మరణానంతరం దానిని చదివే అవకాశం కేవలం అన్నయ్య సాయికుమార్ కే ఉందని చెప్పేవారని.. అలా కొన్ని రోజుల అనంతరం అమ్మ చనిపోవడంతో అన్నయ్య ఆ డైరీ తీసి చదివారని అందులో “మన బర్త్ మామూలుగా ఉన్న మన డెత్” మాత్రం ప్రపంచమంతా చెప్పుకోవాలని ఒకరకంగా హిందూ లాంటి న్యూస్ పేపర్లో హెడ్ లైన్స్ లో రవిశంకర్ పేరు రావాలని తన తల్లి గారు కోరుకున్నారని ఒక ఇంటర్వ్యూలో రవిశంకర్ చెప్పుకొచ్చారు.
ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత 1986లో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన “ఆలోచించండి” అనే చిత్రంతో తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టాడు. తర్వాత మధురనగరిలో, కీచురాళ్ళు, తొలివలపు మొదలగు చిత్రాల్లో నటించిన పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రౌ డీ యిజం జిందాబాద్ అనే తెలుగు సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి దాదాపు మూడువేల ఐదువందల చిత్రాలకు తన వాయిస్ ను అందించారు. 2009లో విడుదలైన అరుంధతి సినిమాలో విలన్ సోనూసూద్ కు చెప్పిన “అమ్మ బొమ్మాలి” అనే వాయిస్ రవిశంకర్ కు ఎక్కడలేని ప్రజాదరణ తీసుకువచ్చింది. నటుడిగా తెలుగు సినిమా మరిచి పోవడం తో కన్నడంలో సుదీప్ హీరోగా వచ్చిన కెంపెగౌడ (తెలుగు మిర్చి రీమేక్ చిత్రం) బ్లాక్ బస్టర్ కావడంతో కన్నడ ప్రజలు “అఖిల కర్ణాటక సకల కళా వల్లభ రవిశంకర్ అభిమాన సంఘాన్ని” ఏర్పాటు చేసి బొమ్మాలి రవిశంకర్ పై తిరుగులేని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి అభిమానానికి పరవశించి పోయిన రవిశంకర్ జై నా కన్నడ ప్రజలకు అని కంచు కంఠంతో వారందరికీ జై కొట్టారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.