Connect with us

Featured

నా పక్కన మగాడు కనిపిస్తే చాలు.. లింక్ పెట్టేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేసిన సురేఖావాణీ !!

Published

on

సురేఖావాణీ.. ఈ పేరు వినగానే ఎవరికైనా తెలుగు తెరపై ఆమె నటించిన అక్క .. వదిన .. అమ్మ పాత్రలే గుర్తుకొస్తాయి. ఈ తరహా పాత్రలలో ప్రేక్షకులను మెప్పించడంలో ఆమెకి మంచి గుర్తింపు వుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. కుటుంబ నేపధ్యమున్న పాత్రలకు కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతోంది.

సురేఖ వాణి సినిమాల్లో గ్లామర్ డోస్ లేని పాత్రలతో, చక్కటి అభినయంతో ఆఫర్స్ అందుకుంటోంది. చాలా సినిమాల్లో పిన్ని పాత్రలో, ఆంటీ పాత్రలో నటిస్తోంది. అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు, రియల్ లైఫ్ లోని తన హాట్ హాట్ ఫొటోలతో ఈమధ్య సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సందడికి అస్సలు సంబంధమే లేనట్లుంది. వెండితెరపై చీరకట్టులో తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించే సురేఖావాణీ.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో నెటిజన్లందరికీ కనువిందు చేస్తుంది. ఈ మధ్యనే బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అందాలను ప్రదర్శించింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరలయ్యింది. వెండితెరపై ఆమెను కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలి ప్రేక్షకులు మాత్రం ఈ ఫొటోను చూసి షాక్ అవుతున్నారు.

ఇప్పటికే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్న సురేఖా వాణిని ఇలా చూడటం చాలా మందికి ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఆమె గ్లామర్ లుక్స్ పై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ ను కూడా షేర్ చేశారు. భర్త చనిపోయిన 4రోజులకే సురేఖావాణీ ఆనందంగా సినిమా షూటింగ్ లలో పాల్గొందన్న రూమర్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇదిలా వుండగా.. సురేఖావాణి కూతురు సుప్రీత త్వరలోనే సినిమాల్లో నటిస్తున్నట్లు, ఓ యంగ్ హీరో చిత్రంలో సుప్రీత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందనే గాసిప్స్ మీడియా చెవిన పడ్డాయి. వీటన్నిటిపై స్పందించిన సురేఖావాణి తన కూతురి లైఫ్ గురించి, అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చింది.

“”నా పక్కన ఒక మగాడు కనిపిస్తే చాలు.. అతడు నా బాయ్ ఫ్రెండ్ అంటూ కథలు అల్లేస్తున్నారు. అక్కడున్నది కజిన్‌, బ్రదర్‌, తండ్రి ఎవరూ ఉన్నా తెలుసుకోకుండా మాట్లాడేవాళ్ళు ఎక్కువై పోయారు. ముక్కూ, మొహం తెలియనివాళ్ళతో కూడా నాతో లింక్ పెట్టేస్తూ గాసిప్స్ క్రియేట్ చేసేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ వలన నేనెంత మానశిక క్షోభ అనుభవిస్తున్నానో నాకు తెలుసు. నా భర్త సురేష్ తేజ చనిపోవడం నేనిప్పటికీ కోలుకోలేని షాక్. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధను దిగమింగుతూనే నా కూతురుతో సరదాగా గడుపుతున్నాను. నా లైఫ్ నా ఇష్టం. నాకు నచ్చినట్టుగా బతకడమే నాకిష్టం.

నేను.. నా కూతురు సరదాగా సినిమాలకి .. షికార్లకు వెళ్తుంటాము. మా అమ్మ నన్ను స్వేఛ్ఛా భావాలతో పెంచింది. అలాగే నా కూతురిని నేను పెంచుతూ వచ్చాను. మా జీవితాలను ఎవరూ ప్రశ్నించే ఛాన్స్ నేనివ్వను. ఈమధ్య నా కూతురు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని అందరూ అడుగుతున్నారు. తనకి నటనపై ఆసక్తి వుంటే.. సినిమాల్లోకి వెళ్లాలనే ఉత్సాహం వుంటే.. నేను మాత్రం అడ్డు చెప్పను” అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా తెలియజేసింది. ఇక సురేఖావాణి కూతురు తన కెరీర్ ను ఏవిధంగా ప్లాన్ చేసుకుంటుందో.. తల్లి అడుగుజాడల్లోనే నడుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!