‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోతో తెలుగు టీవీ యాంకరింగ్ కు గ్లామర్ తెచ్చిన అందాల తార అనసూయ. తన గ్లామర్ తో జబర్దస్త్ షో ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారామె. ఇక అక్కడ నుంచి బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకువెళ్ళిపోతున్నారు అనసూయ. జబర్దస్త్ సక్సెస్ తర్వాత ఆమె సినిమాల వైపు కూడా వెండితెరపై కూడా తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. అయినా, బుల్లితెరను విడిచి పెట్టలేదు. అక్కడ ఫుల్ టైం చేస్తూ వెండితెర మీద అడపాదడపా మంచి పాత్రలతో మెరుస్తూ వస్తున్నారు. ఈమధ్య ఆమె నటించిన ‘రంగస్థలం’, ‘క్షణం’ చిత్రాలలోని పాత్రలకెంతో మంచి పేరు వచ్చింది.
ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు అనసూయ. అలాగే లేటెస్ట్ గా “కథనం” అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా కధ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. అనసూయ మాత్రం నటిగా వంద మెట్లెక్కినట్టయింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె టీవీల్లోనూ 3 షో లలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా అనసూయ ఈటీవీలో ప్రసారమౌతున్న ‘ఆలీతో సరదగా’ షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా అనసూయ భరద్వాజ్ తన సినిమా కెరీర్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.
అప్పట్లో ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సంబంధించిన వివాదంపై స్పందిస్తూ.. “పవర్ స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సరిక్రొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇంత వరకు ఏ చిత్రం సాధించని రికార్డులను ‘అత్తారింటికి దారేది’ చిత్రం సొంతం చేసుకుంది. ఒకవైపు ఈ సినిమా భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న టైంలో.. పవన్ కళ్యాణ్ పై బుల్లితెర హాట్ యాంకర్ సంచలనమైన కామెంట్స్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయకపోవడం నాకెంతో సంతోషంగా వుంది’ అంటూ షేర్ చేసి సంచలనం సృష్టించారు. అప్పటివరకు అనసూయ బుల్లితెరపై తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల కంటి మీద కునుకు లేకుండ చేయడంతో బుల్లితెర ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆ అభిమానం ఎక్కడి వరకు వెళ్లిందంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేంతస్థాయి వరకు ఆమె ఎదిగిపోయింది. దాంతో అప్పట్లో సోషల్ మీడియాలో అనుసూయకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందనే రూమర్స్ షికార్లు చేశాయి.
అయితే అలాంటి రూమర్స్ పై అనసూయ కూడా స్పందించటం జరిగింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయను అడగటం, ఆమె నో చెప్పటం జరిగింది. అంటే సినిమాల్లో ఐటమ్ క్యారెక్టర్ల చెయ్యను గానీ, హీరోయిన్ గా అయితేనే చేస్తానని అనసూయ చెప్పినట్లు అప్పట్లో రూమర్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం హాట్ యాంకర్ అనసూయ తాను ఈ సినిమాలో ఎందుకు నటించలేదో, ఆ కారణాలను వివరిస్తూ.. మనస్ఫూర్తిగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం వివాదంపై క్లారిటీ ఇచ్చింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమేనని… కానీ అప్పటికీ తను రెండోసారి 6 నెలలు గర్భవతినని. దీంతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం సాంగ్ లో నటించే ఛాన్స్ మిస్సయ్యానని, ఆ తర్వాత ఆ చిత్రం రిలీజైన క్రొత్తలో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ లో నటించలేక పోయినందుకు ఎంతో సంతోషంగా ఉందని కామెంట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై ఎన్నో ఇబ్బందులు పడినట్లుగా ఈ సందర్భంగా అనసూయ తెలియజేసింది. ప్రస్తుతం అనసూయ బన్నీ- సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న తాజా చిత్రంలో విలన్ గా నటిస్తోందని తాజా సమాచారం. ‘రంగస్థలం’ చిత్రంతో మంచి నటిగా అనసూయను ఒక రేంజిలో పరిచయం చేసిన సుకుమార్ ఇప్పుడు ఆమెను మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రంలో విలన్ గా వెండితెరపై చూపించబోతుండడం విశేషం.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.