Connect with us

Featured

నటుడు అచ్యుత్ మరణానికి కారణం వారేనట.. బయటపడ్డ అస్సలు విషయం

Published

on

ఎన్ని సంవత్సరాలు గడిచిన గాని కొంతమంది ఆర్టిస్టులు మాత్రం చిరకాలం గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే గొప్ప నటులలో అచ్యుత్ కూడా ఒకడు. సినీ రంగంలోనూ, బుల్లితెరలోను తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పట్లో బుల్లితెరలో స్టార్ నటుడిగా ఒకే వెలుగు వెలిగాడు అచ్యుత్. నటుడిగా సీనియర్ హీరోల తోటి, స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో అందరితోనూ నటించాడు అచ్యుత్. కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి చూపేవాడు అచ్యుత్.

ఆ ఆసక్తితోనే మొదటగా బుల్లితెరలో నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇంకా ఆ తరువాత 1989 లో ఆదివారం అమావాస్య అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇంకా ఆ సినిమా అచ్యుత్ కి మంచి పేరుని, గుర్తింపును తెచ్చి పెట్టింది. అలా సపోర్టింగ్ యాక్టర్ గా మొదలయిన ఆయన ప్రయాణం ప్రేమ ఎంత మధురం, స్వాతి కిరణం, అక్క మొగుడు, తాజ్ మహల్ ఇలా చాలా సినిమాల్లో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.

అసలు అచ్యుత్ సినిమాల్లోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవినే ప్రధాన కారణం అంట. అచ్యుత్ మొదట నుంచి మెగాస్టార్ అభిమాని. అలా మొదట నుంచి చిరంజీవి సినిమాలు చూసి ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాడట. అలా ఎన్నో కష్ట నష్టపడి, వాటిని ఓర్చుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ఆయన ఎంతగానో అభిమానించే చిరంజీవితో నటించే అవకాశం రావడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయనాని ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా దాదాపు 50 సినిమాల దాక నటించాడు. అచ్యుత్ మంచి అందగాడు కూడా.బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించాడు. హిమాభిందు, అన్వేషిత, అంతరంగాలు, ప్రతి బంధాలు వంటి సీరియల్స్ మంచి గుర్తింపునిచ్చాయి. 1989 నుంచి 2002 వరకు సినీ రంగాన్ని, బుల్లితెరని ఒక ఊపు ఊపేసాడు.

కెరీర్ మంచి పీక్ స్థాయిలో ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు. బిజినెస్ మాన్ గా ఎదగాలని 40 లక్షలు దాక పెట్టుబడి పెట్టి అప్పుల పాలు అయిపోయాడు. ఒకానొక సమయంలో మానసిక వేదనతోను అప్పుల ఒత్తిడి వలన 2002 డిసెంబర్ 26 న గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా అందరిని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంకా అచ్యుత్ వ్యక్తిగత విషయానికి వస్తే అచ్యుత్ మచిలీపట్నంకి చెందినవాడు. తండ్రి పేరు రామారావు.. తల్లి పేరు సుజాత. అచ్యుత్ కి ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇతని అసలు పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. ఇతని భార్య పేరు రమాదేవి. అచ్యుత్ కి ఇద్దరు కూతుళ్లు. వాళ్ళ పేర్లు సాయి శివాని, సాయి సుజాత. ఈయన కూతుళ్లు ఇద్దరు ఉన్నత చదువులు చదువుకుని బాగా సెటిల్ అయ్యారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!