Connect with us

Featured

ఆ వ్యక్తే నాపై కుట్ర చేసి జైలుకు పంపించాడు.. షాకింగ్ నిజాలు చెప్పిన సుమన్..!

Published

on

తెలుగు చలన చిత్రసీమలో అందాల హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమన్‌ ఒకప్పడు టాలీవుడ్‌ లో క్రేజీ హీరోగా, యాక్షన్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఆరోజుల్లో ఏర్పడిన పోటీ వాతావరణం వలన ఊహించని విధంగా సుమన్‌ కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు. దాంతో అతని కెరీర్‌ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత కొన్ని విపత్కార పరిస్థితుల్లో సుమన్ జైలుకు వెళ్లటంతో ఆయన సినిమా కెరీర్‌ పూర్తిగా దెబ్బతింది.

అయితే సుమన్ జైలుకు వెళ్లటం వెనుక ఓ ప్రముఖ హీరో హస్తం ఉన్నట్టుగా అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. ముందు కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమన్‌ ఆనతికాలంలోనే టాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. తన మిత్రుడైన భానుచందర్‌ సహాయంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుమన్‌ కు యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. మార్షల్‌ ఆర్ట్స్‌ లో ప్రావీణ్యం ఉండటంతో పాటు హీరోకుండాల్సిన పర్సనాలిటీ వుండటంతో సుమన్‌ కు ఆ అందమే ప్లస్ పాయింట్ గా మారి మెగాస్టార్ చిరంజీవిలాంటి అగ్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ మంచి ఊపులో ఉన్న టైంలో సుమన్‌ బ్లూ ఫిలింస్‌ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లటంతో అతని కెరీర్‌ ఒక్కసారిగా తారుమారైంది. ఆరోజుల్లో సుమన్‌ ఎదుగుదలను ఆపేందుకునే టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు సుమన్ ను బ్లూఫిల్మ్ కేసుల్లో ఇరికించారన్న గాసిప్స్ సంచలనం సృష్టించాయి.

సుమన్‌ను బ్లూ ఫిలింస్‌ కేసులో అరెస్ట్ చేసి, ఆయనపై గూండా యాక్ట్‌ కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఈ వివాదంలో తెర వెనుక ఓ ప్రముఖ హీరో హస్తం వున్నట్లుగా టాక్ వినిపించింది. ఎక్కడైతే సుమన్‌ తనకు పోటి వస్తాడన్న స్వార్థంతో ఆ హీరోయే ఇదంతా చేయించాడన్న గాసిప్స్ వినబడినా ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో అవన్నీ రూమర్స్‌ గా కొట్టి పారేశారు. జైలు నుండి బయటికొచ్చి అన్నమయ్య లాంటి భక్తి చిత్రాలలో నటించి తర్వాత కూడా ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా చాలా సందర్భాల్లో సుమన్‌ కు ఇదే ప్రస్తావన ఎదురయ్యేది. అసలు సుమన్‌ ను ఇరికించిందెవరు..? నిజంగానే టాలీవుడ్ లోని ప్రముఖులా.? లేక బయటి వ్యక్తులా..? సుమన్ తో పాటు భానుచందర్‌ను కూడా ఇబ్బంది పెట్టాలని చూశారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు తరుచూ సుమన్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుంటే.. గతంలో చాలాసార్లు ఈ సందేహాలకు క్లారిటీ ఇచ్చారు సుమన్‌. అయితే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు హీరో సుమన్.

“తనను కేసులలో ఇరికించిన వ్యక్తి కోసం గతంలో ఓ తమిళ పత్రిక ఇంటర్వ్యూలో అన్ని విషయాలు క్లుప్తంగా తెలియజేశానని‌ అతని పేరు దివాకర్ అని, అతనికీ టాలీవుడ్ కూ ఏ సంబంధం లేదని, తన సమస్య పూర్తిగా ప్రైవేట్‌ ఫ్యామిలీ ఎఫైర్‌ అని, అయితే ఈ వివాదంలోకి సినీ ప్రముఖుల పేర్లను మీడియావాళ్ళు కావాలనే ప్రస్తావించారని” బాధ పడ్డారు సుమన్. ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం చెబుతూ.. “తను జైలుకు వెళ్తానన్న విషయం తనకు ముందే తెలుసని, ఈ వివాదంలో తన మిత్రుడు భాను చందర్‌ను కూడా ఇరికించే ప్రయత్నంలో వున్నారని తెలుసుకుని అతన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశానని, ఆ టైంలో భానుచందర్‌తో తనను కలవొద్దని, ఫోన్‌ కూడా చేయొద్దని చెప్పానని, నేను టాలీవుడ్ లో హీరోగా బాగానే క్లిక్‌ అవుతానని నమ్మిన ఏకైక వ్యక్తి భాను చందరేనని, నా వల్ల అతను ఇబ్బందులు పడకూడాదనే అలా చెప్పానని తెలిపారు సుమన్. ఆ రోజు జరిగిన వివాదాలకు పూర్తి కారణం అప్పటి నా మిత్రుడు దివాకరే. అతనికి సంబంధించిన విషయాలేవి నేను రహస్యంగా దాయలేదు. కానీ మీడియా మాత్రం కొంత మంది హీరోల పేర్లు తెర మీదకు తీసుకువచ్చింది. వాస్తవానికి అవన్నీ వట్టి పుకార్లే..

ఆ రోజు జరిగిన దానితో ఏ హీరోకు సంబంధం లేదు. అంతే కాకుండా నాపై కేసు ఫైలైన సమయంలో గూండా యాక్ట్‌ పెట్టడంతో పరిస్థితి మరింత సీరియస్‌ అయ్యింది. అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్‌ లేకపోవటంతో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి క్లీన్‌ చీట్‌ ఇవ్వడానికి, అసలు విషయం బయటకు రావాడానికి చాలా టైం పట్టింది. చివరకు అన్ని ఆరోపణలు అబద్ధాలేనని తేలిపోయింది” అంటూ ఆనాటి చేదు జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు హీరో సుమన్‌.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!