ఈమధ్య కాలంలో విడుదలైన చిరంజీవి 150 వ చిత్రం ” ఖైదీ నంబర్ 150″ ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన స్టైలిష్ విలన్ తరుణ్ అరోరా పైకి స్టైలిష్ గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ.. తన స్టైల్తో, లుక్స్తో దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు.
ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సిన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ స్టైలిష్ విలన్ ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కు స్వయానా భర్త. ఆమె మరెవరో కాదు. గతంలో ‘ప్రేమించుకుందాం రా’ ‘రావోయి చందమామ” వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అందాల తార అంజలా జవేరి. ఏంటి.. అవాక్కయ్యారా.?! నిజమేనండి. తనకు సినీ అవకాశాలు రావడానికి కారణం తన భార్యేనని, కోలీవుడ్, టాలీవుడ్లలో తన భార్య అంజలా జవేరికి ఉన్న పరిచయాల మూలం గానే తనకు సినిమా ఛాన్స్ లు వస్తున్నాయని స్వయంగా తరుణ్ అరోరాయే మీడియా ముందు చెప్పడం విశేషం.
ఈమధ్య ఇతను మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అర్జున్ సురవరం’ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించాను. తమిళ చిత్రం ‘కణితన్’ కి రీమేక్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృకలో కూడా నేనే నటించా. అక్కడ కథ ప్రధానంగా హీరో, విలన్ల మధ్యే సాగుతుంది. తెలుగులో మాత్రం ఇతర పాత్రలకి కూడా ప్రాధాన్యం దక్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసినవాళ్లంతా చాలా బాగుంది అంటున్నారు. అదే టైంలో బాలీవుడ్ లో నేను నటించిన సినిమాలు చూసి కోలీవుడ్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. మొదటి సినిమాలోనే నా నటన నచ్చడంతో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక టాలీవుడ్లో అయితే నా కోలీవుడ్ సినిమాలు విడుదలైన తర్వాతే చిరంజీవి గారి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది” అని తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలోనే అంజలా జవేరి ప్రస్తావన తీసుకు రావడంతో.. “మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. మాది 20 ఏళ్ల ప్రేమ బంధం. ఆరేళ్ల కిందట మా కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాం. ముందుగా నేనే తనకు నా ప్రేమ సంగతి చెప్పాను. అప్పుడు తను దక్షిణాదిలో సినిమాలు చేస్తుంది. నేనేమో మోడల్ గా ఉన్నా. ఒక ఈవెంట్ లో కలుసుకున్నప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. తర్వాత ప్రేమ, పెళ్లి. మాకింతవరకూ పిల్లలు లేరు. మేమే ఒకరికొకరు పిల్లల్లాగా ఉంటాం. పెద్దలు కుదిర్చిన బంధంలో పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య మరింత ప్రేమ పుట్టేందుకు పిల్లలొస్తుంటారు. కానీ మేం మాత్రం ముందు నుంచే ప్రేమలో ఉన్నాం. నేనైనా, అంజలా జవేరి అయినా మా ఇద్దరిదీ ఒకటే ఫీలింగ్.. మనసుల్లో ప్రేమ ఉండాలి. అలాంటి బంధం ఎప్పటికీ ధృడంగా ఉంటుంది.” అని తెలియజేశారు తరుణ్ అరోరా. “ఆ మధ్య “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో చివరిసారిగా నటించిన అంజలా జవేరి ఆ తర్వాత తెలుగులో నటించలేదు. మరి అంజలా జవేరి తెలుగులో మళ్లీ నటించేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?” అనడిగిన ప్రశ్నకు తరుణ్ బదులిస్తూ.. “మంచి కథ కోసం ఎదురు చూస్తోంది. గ్లామర్ పాత్రలు చేయడానికి ప్రస్తుతం చాలా మంది యువ కథానాయికలు ఉన్నారు. ఈ దశలో అంజలా తనకు తగిన కథ, పాత్ర దొరికితే నటించాలని ప్రయత్నం చేస్తోంది.” అని చెప్పి ఇంటర్వ్యూను ముగించారు.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.