Connect with us

Featured

గోల్డ్ బిజినేస్ లో చేతులు కాలడంతో… కొత్త మార్గాలు వెతుకున్న ముద్దుగుమ్మలు…!?

Published

on

అవంతిక, మిత్రవింద ఇవేవో సినిమా పాత్రల పేర్లులా వున్నాయి. వీళ్ళు సంపాదించడమేటని బుర్ర గోక్కుంటున్నారా.? మరీ అంతలా ఆశ్చర్యపోకండి. బాహుబలి లోని అవంతిక అంటే తమన్నా.. మగధీర లోని మిత్రవింద అంటే కాజల్ వీళ్ళిద్దరి సంపాదన కోసమే మీరిప్పుడు చదవబోతున్నారు. వీళ్ళిద్దరి కోసమే ఇంత ప్రత్యేకంగా ఎందుకు చదవాలంటే.. సినిమా కెరీర్ ఎంత గొప్పగా ఉన్నా తారలకు సినీరంగం ద్వారా వచ్చే రెమ్యునరేషనే కాకుండా వేరే వేరే సైడ్ బిజినెస్ లు ఉండటం ఈ రోజుల్లో సాధారణమైన విషయమే..

అలా చూసుకుంటే మన టాలీవుడ్ లోని హీరోలు దగ్గర్నుండి దర్శకుల వరకూ రకరకాలుగా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ఈ మధ్య ఓ ఫ్యాషన్ అయిపోయింది. అవకాశాలు తగ్గి సినీరంగం నుండి బయటికి వచ్చినప్పుడు ఖాళీగా ఉండకుండా ఆదాయం ఆగిపోకుండా చేసుకునే ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు లాభాలు తెచ్చిపెడుతుంటాయి. కొన్ని సార్లు నష్టాల పాలు చేస్తుంటాయి. గతంలో ఒక్క స్టార్ డైరెక్టర్ తాను భారీగా నిర్మించిన 2 అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన నష్టాల ఫలితంగా ఎంతో అపురూపంగా కట్టుకున్న థియేటర్లను కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. శోభన్ బాబు లాంటి అగ్ర హీరోలు రియల్ ఎస్టేట్ రంగంలో చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టి నలుగురికి మార్గదర్శిగా నిలిచిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

ఇక ప్రస్తుతాంశానికొస్తే.. మిల్కీ బ్యూటీ తమ్మన్నా – క్రేజీ స్వీటీ కాజల్ కూడా ఇదే తరహాలో ఆలోచించి ఎవర్ గ్రీన్ గోల్డ్ బిజినెస్ ను గతంలోనే స్టార్ట్ చేసేశారు. మూడేళ్ళ క్రితం తమన్నా 2015లో విటెన్ గోల్డ్ పేరుతో ఈ కామర్స్ లో పెట్టుబడులు పెట్టింది. కాని అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. నష్టాలు కూడా తేవడంతో 6 నెలల నుంచి తమన్నాకు ఆ నష్టాన్ని పూడ్చడం శిరో భారంగా మారిందట. ఇక విధి లేని పరిస్థితుల్లో దాన్ని మూసేసే నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. ఇక కాజల్ సైతం తన చెల్లెలు నిషా అగర్వాల్ తో కలిసి తమన్నా మొదలుపెట్టినట్టుగానే జ్యువెలరీ పేరుతో రిటైల్ బిజినెస్ స్టార్ట్ మొదలు పెట్టింది. దాని పరిస్థితి కూడా కొంతకాలంగా అటుఇటుగా ఉందని సమాచారం. నిజానికి వీళ్ళిద్దరు ఇంత సీరియస్ గా గోల్డ్ బిజినెస్ లో ఉన్నట్టు చాలా మందికి తెలియదు. కారణం ఏమిటంటే.. వాళ్ళ బ్రాండ్ ను వాళ్ళే సరిగా ప్రమోట్ చేసుకోలేకపోవడం. దానికి తోడు స్థిమితంగా ఉండలేని గోల్డ్ బిజినెస్ అంటే చాలా శ్రద్ధ పెట్టాలి. సినిమాయే ప్రపంచంగా ఉండే సినీ తారలకు అది అంత ఈజీ కాదు. అందుకే తమకు రాని విద్యలో కాజల్-తమన్నా చేతులు కాల్చుకున్నట్టు అర్ధమైంది.

అనుభవాన్ని మించిన గురువు లేరన్న సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మిత్రవింద, అవంతికలు ఇప్పుడు తన ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించే పనిలో పడి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తమ లైఫ్ స్టైల్ నే మార్చేశారు. ఈ రోజుల్లో కాస్త గుర్తింపు వస్తే చాలు సినిమా హీరోయిన్‌లు షాప్ ఓపెనింగ్‌లు అంటూ.. లైవ్ పర్ఫార్మెన్స్‌ లు అంటూ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాజల్, తమన్నాకు మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ఒక్క ట్వీట్ వేస్తే.. ఒక్క ఇన్‌స్టా పోస్ట్ పెడితే చాలు లక్షల్లో లైకులు.. వేలల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని బ్రాండింగ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మలు.

కానీ గతంలో గోల్డ్ బిజినెస్ లో వచ్చిన నష్టాలను పూడ్చేందుకుగానూ వీళ్ళిద్దరూ టైమ్ పాస్ గా కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ కి కూడా సపరేట్ రేట్ ఉంటుందని తాజా సమాచారం. ముఖ్యంగా హీరోయిన్‌లకు ఉన్న క్రేజ్ వాడుకోడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్స్‌లో తమ బ్రాండ్స్‌కు ప్రమోషన్ చేయించుకుంటున్నాయి కార్పోరేట్ కంపెనీలు. అలా ఒక్కో ట్వీట్ చేయడానికి కూడా లక్షల్లో వసూలు చేస్తుంటారు తమన్నా, కాజల్. వీళ్లిద్దరూ తమ క్రేజ్‌ను ఇలా వాడుకుంటూ లక్షలు సంపాదించుకుంటున్నారని.. ఎలాగో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడు అవకాశాలు రావడం లేదు కాబట్టి తమ క్రేజ్‌ను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారని ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మేధాశక్తి వున్నవాళ్ళు ఎడారిలో ఇసుకను సైతం అమ్మి బ్రతికేస్తారనడానికి నిదర్శనం ఇదేనేమో.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!