Connect with us

Featured

ఈ హీరోయిన్స్ ని ఇప్పుడు చుస్తే అస్సలు గుర్తు పట్టరు..!!

Published

on

చాలామంది హీరోయిన్లు ఒకానొక సమయంలో సినీ పరిశ్రమలో టాప్ పొజిషన్ లో ఉండి ఆ తర్వాత ఎవరికీ కనబడకుండా మాయమైపోయిన వారు ఎందరో ఉన్నారు. సినిమాలు రాక సినీ ప్రపంచం బోర్ కొట్టేసిందో లేక దాంపత్యజీవితాన్ని మొదలుపెట్టాలనో పూర్తిగా సినీ పరిశ్రమను వదిలి పోయిన వారు చాలామంది ఉన్నారు. సినీ పరిశ్రమలో కొన్ని హిట్లు వచ్చిన తర్వాత కూడా వారు మాత్రం సినీ పరిశ్రమను వదిలి వెళ్లారు.

అయితే వారు ఇప్పుడు నిజజీవితంలో ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నారు…? అన్న విషయాల గురించి ఆలోచిస్తేనే ఇలానే ఉంటుంది. అయితే అలా వెళ్ళి పోయిన వారిలో ప్రముఖంగా ఉన్న వారి గురించి తెలుసుకుందామా…

ఇక ఈ లిస్టులో మొదటగా వినిపించే పేరు అపర్ణ. 1990లో సుందరాకాండ సినిమా ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం అయింది. కేవలం ఆ ఒక్క సినిమాతోనే ఆవిడ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఆ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఆవిడ “అక్క పెత్తనం చెల్లెలి కాపురం” అనే ఒక్క సినిమా మాత్రం చేసి ఆ తర్వాత సినీ పరిశ్రమ నుంచి కనుమరుగైపోయింది. అయితే టాలీవుడ్ లో నుంచి వెళ్లిపోయాక బాలీవుడ్ లో నాకౌట్ అనే సినిమా లో నటించింది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో తాను వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇప్పుడు ఆవిడకు ఇద్దరు పిల్లలు భర్త తో హ్యాపీగా జీవి చేస్తోంది.

ఇక ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ అందాల నటి గిరిజ. ఈమె కుటుంబం విషయానికి వస్తే… తన తండ్రి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైద్యుడు. తల్లి ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. ఈవిడ తన యుక్తవయసులో భరతనాట్యం నేర్చుకోవడానికి, అలాగే భారత దేశం పై ఉన్న మమకారంతో ఆవిడ భారత్ కు వచ్చింది. అయితే 1989 సంవత్సరంలో ఆమె డాన్స్ ను చూసిన మణిరత్నం తనని గీతాంజలి సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో తన నటన కి తెలుగు సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు.అయితే ఆ తర్వాత ఆమె తెలుగులో హృదయాంజలి అలాగే మలయాళంలో మరో సినిమాను మాత్రమే చేసింది.అయితే ఆవిడ ఎందుకు సినిమాలో నుంచి తప్పుకొని తిరిగి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం ఆమె అక్కడ రచయితగా స్థిరపడింది. అయితే ఇప్పటికీ తాను సినిమా పై ఉండే ఇష్టంతో ఇప్పటికీ సినిమా పై అధ్యయనం చేస్తూనే ఉంది. సినీ పరిశ్రమలోని కొంతమంది దర్శకులు నిర్మాతలతో కలిసి పని చేస్తూనే ఉంది.

ఇక ఈ లిస్టులో మరో హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్ లో పెయింటర్ బాబు అనే హిందీ సినిమా ద్వారా ఆవిడ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఈవిడ కూడా అతి తక్కువ టైమ్ లోనే బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ బాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించారు. ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా నటించింది. టాలీవుడ్ లో ఈమె నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత జీవన పోరాటం అనే సినిమాలో కూడా నటించింది. ఆపై చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమాలో కూడా హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించింది. అయితే టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసినా, ఆవిడ బాలీవుడ్ లో మాత్రం అనేక సినిమాలను చేసింది. అలా సినిమాలు చేస్తూనే తాను సినీ జీవితానికి కాస్త దూరం అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆవిడ అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ బిజీగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆవిడకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ కేరళ కుట్టి సింధు మీనన్. రష్మీ అనే తన సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితాన్ని మొదలుపెట్టిన సింధు మీనన్… ఆ తర్వాత మలయాళంలో అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సింధు తినేత్రం, శ్రీరామచంద్రులు, ఆడంతే అదో టైపు, ఇన్స్పెక్టర్, భద్రాచలం సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ లో ఆమె చివరి సినిమా సుభద్ర. అయితే ఆ తర్వాత 2010 సంవత్సరంలో ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో హ్యాపీ గా తన సంసార జీవితాన్ని గడిపేస్తోంది. ఇప్పుడు ఆమెకు ఒక కూతురు కూడా ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Advertisement

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!