Connect with us

Featured

ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా‌లో నటించని టాలీవుడ్ హీరోలు వీరే !!

Published

on

రీమేక్‌ సినిమాలన్నవి ఏ ఇండస్ట్రీ లోనైనా సాధారణమే. కథ నచ్చితే రీమేక్ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తిని చూపిస్తుంటారు. నాటి తరం హీరోలైన NTR, ANR, కృష్ణ.. మధ్యతరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు కూడా ఎన్నో రీమేక్‌ చిత్రాలలో నటించారు.

ఇక నేటి తరం టాప్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రామ్, నాగ చైతన్య‌లు కూడా రీమేక్ చిత్రాల్లో నటించారు. అయితే సూపర్‌ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లు మాత్రం ఇంతవరకూ రీమేక్‌ చిత్రాలలో నటించలేదు. మహేష్ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ మూవీ లోనూ.. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలోనూ నటిస్తుండగా.. వీరిద్దరి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా లేకపోవడం విశేషం. ఇక వీళ్ళిద్దర్నీ పక్కన పెడితే ఇంతవరకూ రీమేక్‌ చిత్రాలలో నటించకుండా వున్న మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరో మీరే తెలుసుకోండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు

Advertisement

మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’ చిత్రం అందరూ రీమేక్ అనుకుంటారు. కానీ., ఆది ద్విభాషా చిత్రం అన్న సంగతి చాలామందికి తెలియదు. అలాగే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రీమేక్స్ చిత్రాలలో నటించే ఇంట్రెస్ట్ లేదని చాలా ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు.

అల్లు అర్జున్

వాస్తవానికి ‘ధృవ’ చిత్రంలో బన్నీ నటించాల్సింది. కాని అనివార్య కారణాల వలన ఆ రీమేక్ చిత్రం రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళింది.

టాలీవుడ్ భల్లాల దేవ రానా

‘నా ఇష్టం’ నుండి ‘విరాట పర్వం’ వరకు రానా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమాలు అన్నీ స్ట్రెయిట్ చిత్రాలే.. కాకపోతే ఆమధ్య మలయాళ రీమేక్ అయిన ‘బెంగుళూర్ డేస్’ చిత్రం తమిళ వెర్షన్ లో నటించాడు. కాని ఆది తమిళ చిత్రమే కానీ తెలుగులో విడుదల కాలేదు.

సాయి ధరం తేజ్

Advertisement

యంగ్ మెగా హీరో సాయి ధరం తేజ్ కి ఆమధ్య కొన్ని ఫ్లాప్స్ వచ్చినా స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతోనే హిట్ లను సాధించాడు. కాని రీమేక్ ల జోలికి ఎప్పుడూ పోలేదు.

విజయ్ దేవరకొండ

‘పెళ్ళి చూపులు’ చిత్రం నుండి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం వరకు విభిన్న కథలతో హిట్స్ & డిజాస్టర్స్ వచ్చినా విజయ్ తన కెరీర్ లో ఇంకా రీమేక్స్ జోలికి వెళ్ళలేదు.

నితిన్

నితిన్ ఆమధ్య వరుస ఫ్లాపులతో కెరీర్ దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్ లో ఉన్నా ఎప్పుడు రీమేక్స్ చేయలేదు.

మంచు విష్ణు

Advertisement

కంటెంట్ మూవీస్ తో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన మంచు విష్ణు కూడా ఇప్పటి వరకు రీమేక్స్ చిత్రాలలో నటించలేదు.

అఖిల్ అక్కినేని

ఇంతవరకూ నటించింది 3 చిత్రాలే అయినా.. అఖిల్ ఇంతవరకూ రీమేక్ చిత్రాలలో నటించే ప్రయత్నమే చేయలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!