తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటనతో రాయలసీమ మాండలికాలితో తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, ప్రముఖులు, నటీనటులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయప్రకాష్ రెడ్డి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటనే చెప్పాలి. జయప్రకాష్ రెడ్డి విలక్షణతకు పెట్టింది పేరు. ఆయన విలనీలో ఒక మ్యాజిక్ ఉంది. కాలానికి తగినట్లుగా తనను తాను మౌల్డ్ చేసుకుని వెండితెరను ఏలాడాయన. అందుకే ఆయన సామాజిక మాధ్యమాల్లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు.
అంతే కాదు, జబర్దస్త్ స్కిట్స్ చేసే వారికి కూడా ఆయన మ్యానరిజాలే పాఠాలు అవుతున్నాయి. జయప్రకాష్ రెడ్డి పేరుకు విలన్, కానీ నిజ జీవితంతో ఆయన హీరో. నిరాడంబరత ఆయనకు ఉన్న అపురూప ఆభరణం. ఆయన మంచితనమే తరగని ధనంగా మాచుకున్నారు. ఆయన సినీ నటుడిని అని ఎక్కడా గర్వం చూపించేవారు కాదు, అంతేనా ఆయన రైళ్ళల్లో ఎపుడు రెండవ తరగతిలోనే ప్రయాణించేవారు. రైలు కోసం వేచి చూస్తూ సాధారన ప్రయాణికుడిగా ఫ్లాట్ ఫారం పై వేచి ఉండే జేపీని చూసి అంతా ముచ్చట పడేవారట. ఇక ఆయనకు నాటకాల పిచ్చి. తాను ఎంత డబ్బు అయినా పెట్టి నాటకాలు నిర్వహించడానికి రెడీ. గుంటూరు అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అక్కడ ఆయన నాటకాలు ప్రతీ నెలకు ఒకటి వంతున నిర్వహించేవారు. ఇక ఎక్కడైనా నాటకాల పోటీలు ఉంటే చాలు జేపీ అక్కడకు వెళ్ళేవారు, సాధారణ ప్రేక్షకుడిగా కూర్చుని నాటకం చూడడం ఆయనకు ఇష్టం. తెలుగు భాషలోని సొగసు, యాసలు, ఆయనకు చాలా ఇష్టం. మాండలీకాలు పట్టుకుని ఆయా పాత్రల పోషణ ద్వారా వాటిని ప్రాణం పోయడంలో జేపీ దిట్ట.
సినీ రంగంలో అందరిదీ ఒక్కటే మాట. జేపీ లాంటి వారు లేరని, ఆయనకు డబ్బు కంటే కూడా నటన మీదనే ప్రేమ. మనుషుల మీదనే ప్రేమ. ఇలా తనకు తాను ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కనుకనే ఆయన లేరు అన్న మాట విన్న చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురి అయింది. భాషాభిమానులు తల్లడిల్లిపోయారు. ఏమైనా జేపీ హీరో. ఆయన గ్రేట్ అంటున్నారు అంతా. అయితే ఈ సీనియర్ నటుడికి అకస్మాత్తుగా మృతి చెందడానికి అసలు కారణం తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమేనని తెలుస్తోంది.నెగిటివ్ రోల్స్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన జయప్రకాష్ రెడ్డి కమెడియన్ గా కూడా అభిమానుల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎలాంటి పాత్రలనైనా సరే తనదైన శైలిలో చేసి మెప్పించే సత్తా ఉన్న జయప్రకాష్ స్టేజ్ ఆర్టిస్ట్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాటకాలు అంటే ఆయనకు అమితమైన ఆసక్తి.
ఇండస్ట్రీలో తోటి నటీనటులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఎవరు తనని పలకిరించినా సొంత మనిషిలా ఆప్యాయంగా పలకిరించేవారు. అలాంటి జయప్రకాష్ కి ఒత్తిడికి లోనవ్వడం ఏంటి అని అందరూ అనుకున్నారు. అయితే జయప్రకాష్ కి కొన్ని నెలల క్రితమే హార్ట్ లో స్టంట్ వేశారు. అనంతరం ఆయన మెల్లగా కోలుకున్నారు. హార్ట్ పేషేంట్ కావడంతో వీలైనంత వరకు ఒత్తిడికి గురి కాకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ఇటీవల జయప్రకాష్ కుటుంబంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృబించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల ఒత్తిడి.. జేపీ భార్యతో పాటు కుమారుడు కూతురు కోడలు అలాగే వారి పిల్లలు కూడా కరోనా వైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. అయితే జయప్రకాష్ కి మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా కరోనా భారిన పడటంతో జయప్రకాష్ మానసికంగా ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. ఆ ఒత్తిడి వలనే జయప్రకాష్ కి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.