టాలీవుడ్ సినిమాలలో నటించే విలన్లు చాలామంది పర రాష్ట్ర వ్యక్తులే. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన వ్యక్తులే మన తెలుగు సినిమాలలో ప్రతి కథానాయకునిగా కనిపిస్తారు. నిజంగా కొన్నిసార్లు హీరోకి కూడా రాని క్రేజ్ ప్రతి కథానాయకుడుకి కొన్ని సినిమాల ద్వారా లభించాయి అంటే నమ్మాల్సిందే. అలా చాలా మంది బాలీవుడ్ లో నటించడానికి ముందుగా దక్షిణ సినీ పరిశ్రమలో విలన్ గా పేరు పొంది, ఆ తర్వాత బాలీవుడ్ లో వారి ప్రస్థానాన్ని కొనసాగించే వారు ఎందరో.
ఇకపోతే ఈ లిస్టు లో ప్రముఖ ప్రతి కథానాయకుడు అయిన శరత్ సక్సేనా గురించి ఓ సారి తెలుసుకుందాం. 1950, ఆగస్టు 17 న మధ్య ప్రదేశ్ లోని సత్నా లో జన్మించాడు. భోపాల్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, జబల్పూర్ లోని చర్చి బాయ్స్ సీనియర్ సెకండరీ హైస్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నాడు. అలా 1972 లో ముంబైకి వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ప్రతినాయక, సహాయ పాత్రల్లోకి అడుగు పెట్టాడు. ఈయన భార్య పేరు శోభ. వీరికి వీర, విశాల్ అనే ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆయన కేవలం హిందీ లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.
ఇక ఈయన మొదటగా బాలీవుడ్ లో 1977 లో ఏజెంట్ వినోద్ సినిమాలో మోడీ సినిమాలో నటించారు. ఇక టాలీవుడ్ లో 1989 లో అశోక చక్రవర్తి సినిమాలో నటించిన ఆయన ఆ తర్వాత నిర్ణయం, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రీ, మనీ, బంగారు బుల్లోడు, గండీవం, ఎస్పీ పరశురాం, ముగ్గురు మొనగల్లు, మనీ మనీ, రాజా సింహామ్, ఉగాది, ఓక్కడు చాలు, సింహాద్రి, బన్నీ సినిమాలలో నటించాడు. అలాగే హిణిది టెలివిజన్ లో ప్రసారమయ్యే మహాభారతంలో కిచకా పాత్ర కూడా పోషించారు. కనూన్, సజన్ రే ఫిర్ జూత్ మాట్ బోలో సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.
అంతేకాకుండా ఈయన మిస్టర్ ఇండియా , త్రిదేవ్ , ఘయల్ , ఖిలాడి , గులాం , ది హిడెన్ ట్రూత్ , సోల్జర్ , బాగ్బాన్ , ఫనా , క్రిష్ , ఏక్ హి రాస్తా (1993), బజరంగీ భైజాన్ లో నటించాడు. హిందీ చిత్రం మిస్టర్ ఇండియాలో డాగా పాత్రకు గాను ఆయనకు మంచి పేరు లభించింది. 1998 లో గులాం సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం కోసం తీసుకున్నారు.ఇక ఈయన ప్రస్తుతం ముంబై శివార్లలోని ఓ ఐలాండ్ లో జీవిస్తున్నారు. తనకు వయసు మీద పడటంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. టాలీవుడ్ నుండి అనేక సినిమా ఆఫర్లు వస్తున్న కానీ ఆయన దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇక పై ఈయనను మనం వెండితెరపై చూసే అవకాశం లేదు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.