Connect with us

Featured

నాలుగు రోజుల షూటింగ్ తరువాత నన్ను తీసేశారు…!! ఒక్కదాన్నే బాధ పడేదాన్ని… – మధుబాల

Published

on

1992లో విడుదలైన ‘రోజా’ చిత్రం గుర్తుందా.? ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మధుబాల ఇప్పటికీ తాను హీరోయిన్ నే అంటోంది. ఈ చిత్రంతోనే దక్షిణాది స్క్రీన్ పై మధుబాల తళుక్కున మెరిసింది. అప్పట్లో ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందాల భామ మధుబాలకు ఊహించని విధంగా క్రేజ్ వచ్చింది. 1991లో ‘అళగన్‌’ చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయమైన మధుబాల తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె సినీ రంగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మధుబాల తెలియ జేయడం విశేషం.

”సినిమా రంగంలోకి నేను అడుగు పెట్టిన క్రొత్తలో ఓ సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్ వచ్చింది. 4 రోజులు షూటింగ్ కు కూడా వెళ్ళాను. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ చిత్రం నుండి నన్ను తొలగించేశారు. ఆ సినిమా నుంచి నన్ను ఎందుకు తీసేశారన్న సంగతి కూడా ఆ చిత్ర దర్శక, నిర్మాతలు చెప్పలేదు. అదే నాకు పెద్ద బాధ అనిపించింది. ఊహించని ఆ సంఘటనకు నేను చాలా ఫీలయ్యాను. ఓ 4 రోజులు రాత్రుళ్ళు నా బెడ్‌ రూమ్‌లో ఒక్కదాన్నే బాధపడేదాన్ని. నా స్థానంలో వేరే హీరోయిన్‌ ని తీసుకున్నారన్న విషయాన్ని ఆ తర్వాత పేపర్ లో చదివి తెలుసుకున్నాను. అయినా అలా జరగడం ఒకందుకు మంచే జరిగింది. ఆ సంఘటన తర్వాత నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఓ మంచి హీరోయిన్ గా మీ ముందున్నాను” అంటూ మధుబాల తెలియజేసింది.

ఆ సంఘటన తర్వాత ‘రోజా’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మధుబాలకు వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ హీరో Dr. రాజశేఖర్ సరసన ‘అల్లరి ప్రియుడు’ ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘జెంటిల్ మెన్’ ఈ 2 చిత్రాలు మధుబాలను టాప్ రేంజ్ కి తీసుకువెళ్ళాయి. తెలుగులో పుట్టినిల్లా మెట్టినిల్లా, చిలక్కొట్టుడు, గణేష్ వంటి చిత్రాలలో అప్పుడప్పుడూ తళుక్కుమని మెరిసిన ఈ అందాల భామ టాలీవుడ్ కన్నా బాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. బాలీవుడ్ డ్రీమ్ గాళ్ హేమామాలినికి స్వయానా మేనకోడలైన మధుబాల, జూహిచావ్లాకు వదిన అవుతుంది.

అయితే మధుబాల పూర్తి పేరు మధుబాల రఘునాధన్. ఈమెది తమిళ కుటుంబమైనప్పటికీ ముంబైలోనే స్థిరపడింది. అందుకే హిందీ, ఇంగ్లీషు, మలయాళ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నేర్పు మధుబాలకు వచ్చింది. బాలీవుడ్ లో ఆమె నటించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రం ఇప్పటికే ఎవర్ గ్రీన్ హిట్ చిత్రంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో అదరగొట్టినప్పటికీ, దక్షిణాది భాషా చిత్రాల కారణంగానే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మధుబాల 1999లో ఆనంద్ చావ్లాను పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిలై పోయింది. మధుబాలకు ఇద్దరు కూతుళ్లున్నారు. 2008లో నటనపై మక్కువతో రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల టీవీ మరియు సినిమా రంగాలలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. కుటుంబంతో హాయిగా జీవనం కొనసాగిస్తూ, రెండో ఇన్నింగ్స్ ను కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!