పోకూరి బాబూరావు నిర్మాతగా ఈతరం ఫిలింస్ బ్యానర్ పై రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం “యజ్ఞం” ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ మాస్ లుక్ ఇతనికి మంచి పేరు తెచ్చిదని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అంది పుచ్చుకున్నారు హీరో గోపీచంద్.

టి.కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోపీచంద్ మొట్టమొదటిసారిగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన “తొలివలపు” చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తరువాత జయం, వర్షం సినిమాలలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పోకూరి బాబురావు నిర్మాణంలో ఏ ఎస్ రవికుమార్ చౌదరి కాంబినేషన్లో యజ్ఞం సినిమా కథ సిద్ధమవుతోంది.

ఈ కథనం మొత్తం రాసిన తర్వాత ముందుగా ఈ సినిమాను హీరో ప్రభాస్ తో తీయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ కథతో నిర్మాత పోకూరి బాబు రావు ప్రభాస్ తండ్రినీ కలిసి ఆయనకు యజ్ఞం సినిమా కథను వినిపించారు. ఈ సినిమా కథ అతనికి నచ్చడంతో వెంటనే ప్రభాస్ హీరోగా ఈ సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దర్శకుడిగా రవికుమార్ చౌదరిని కాకుండా బి.గోపాల్ తో ఈ సినిమా చేద్దామని భావించారు. అలా దర్శకుడిని మార్చాలనడంతో ఈ సినిమా ప్రభాస్ నుంచి గోపీచంద్ కు వెళ్ళింది.

కథపై, దర్శకుడి పై నమ్మకం ఉండటంతో హీరో గోపీచంద్ ని తీసుకొని ఈ సినిమా నిర్మింద్దామని పోకూరి బాబూరావు చెప్పారు. అలా ఈ సినిమా ప్రభాస్ ని కాదని గోపీచంద్ ను వవరించింది. ఈ క్రమంలోనే ఈ తరం ఫిలిం బ్యానర్ పై పోకూరి బాబూరావు నిర్మాతగా రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని గోపీచంద్ కు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.




























