Connect with us

Featured

ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్న 15 స్టార్ హీరో బ్రదర్స్ వీళ్ళే !!

Published

on

మన భారతదేశ సినీ పరిశ్రమలో ఎంతోమంది నట వారసులు వచ్చి ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో కేవలం తనయులు మాత్రమే కాకుండా అన్నదమ్ములు కూడా సిని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

కేవలం మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశంలో ఉన్న మిగతా ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ముల సినీ పరిశ్రమలు వారి తగ్గ స్థాయిని ఏర్పరుచుకున్నారు. అలా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న అన్నదమ్ములు ఎవరో ఓసారి చూద్దామా..

ముందుగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చూస్తే మెగా హీరోలు చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి చెబుతారు ఎవరైనా. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి హీరోగా నటించగా నాగబాబు కారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియ చేసిన వ్యక్తిగా సీనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు. ఇకపోతే ఈయన వారసత్వం తీసుకున్న కొడుకులు నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ టాలీవుడ్ లో హీరోగా రాణించారు. అయితే ఇది వరకు కాలంలో నందమూరి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో అనుకోకుండా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో ఓవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఇలా వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుపాటి వెంకటేష్ లు కొనసాగుతున్నారు. ఇందులో దగ్గుబాటి సురేష్ సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన పనులు చేసుకుంటుండగా హీరో వెంకటేష్ మాత్రం సినిమాల్లో నటిస్తున్నారు.

ఇక ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీ లో రాణించారు. ఇందులో మహేష్ బాబు తన నటనతో స్టార్ ఇమేజ్ సంపాదించగా రమేష్ బాబు మొదట్లో హీరోగా పలు సినిమాల్లో నటించిన ఆ తర్వాత కేవలం సినిమా నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఇక వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హరికృష్ణ వారసులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి తర్వాత మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు ఇద్దరు హీరోలు గా కొనసాగిన సంగతి కూడా తెలిసిందే.

అలాగే మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. అందులో ఇప్పటికీ సాయి ధర్మ తేజ్ హీరోగా రాణిస్తుండగా తన సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.

ఈ మధ్యకాలంలో సెన్సేషన్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ తనతో పాటు తన తమ్ము డు ఆనంద్ దేవరకొండ ను దొరసాని సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో వరసకు అన్న తమ్ముళ్లు అయ్యేవారు మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తేజ, నాగబాబు కొడుకు వరుణ్ తేజ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన హీరో ఆర్యన్ రాజేష్ సోదరుడు అల్లరి నరేష్. ఇద్దరు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలలో నటించారు.

వీరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా పరిచయం అవ్వగా త్వరలో శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఫ్యామిలీ లో మూడో తరంలో హీరోలుగా వచ్చిన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు.

అలాగే మెగా కాంపౌండ్ నుంచి మరో చెప్పుకోదగ్గ అన్నదమ్ముల హీరోలు ఎవరు అంటే.. అల్లు అర్జున్, అల్లు శిరీష్. వీరిద్దరు కూడా వారి తగ్గ స్థాయికి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో అగ్ర హీరోలు గా కొనసాగుతున్నారు.

ఇక దగ్గుబాటి రానా నుంచి మూడోతరం హీరోగా రానా దగ్గుబాటి ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ అనేక చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక రానా తమ్ముడు అభిరామ్ సురేష్ ప్రొడక్షన్ సంబంధించిన పనులను చూస్తూ ఉన్నాడు.

ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ఫ్యామిలీకి చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా సినిమాల్లో రాణించిన వారే. వారెవరు అంటే సాయికుమార్, రవిశంకర్. వీరిద్దరి కేవలం నటనతోనే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఎన్నో ఇండస్ట్రీలకు సేవలను అందిస్తున్నారు.

వీరితో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. ఈయన సోదరులైన భరత్, రఘు లు కూడా సినీ పరిశ్రమలో రాణించిన వారే.

అలాగే తెలుగు చిత్ర సీమలో స్టార్ కమెడియన్ గా పేరుపొందిన అలీ సైతం తన తమ్ముడు ఖయ్యుం ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినవారే. అలీ కామెడీ రోల్స్ చేస్తుంటే ఖయ్యుం తనదైన స్టైల్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ ను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇకపోతే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోగా మిగతా చిత్ర పరిశ్రమలో ఉన్న అన్నదమ్ముల గురించి చూద్దాం. తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తన తమ్ముడు కార్తీ ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చాడు. వీరిద్దరూ ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

వీరితో పాటు తమిళ ఇండస్ట్రీలో హీరో ధనుష్, డైరెక్టర్ సెల్వరాఘవన్ లు కూడా అన్నదమ్ములే. ఇద్దరు కూడా తమిళ ఇండస్ట్రీలో వారి మంచి పేరు తెచ్చుకున్న వారే.

అలాగే కన్నడ పరిశ్రమకు చెందిన ఇంద్రజిత్ సుకుమారన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా సాగుతున్నారు.

వీరితో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా లు కూడా హీరోలుగా రాణించిన వారే. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి సర్జా గుండెపోటు కారణంగా చిన్న వయసు లోనే మరణించాడు.

వీరితో పాటు జయం రవి, మోహన్ రాజాలు కూడా దక్షిణాది చిత్రసీమలో వారు యాక్టింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు.

వీరితోపాటు వెంకట్ ప్రభు, ప్రేమ్ జి అమరన్ అన్నదమ్ములు చిత్రసీమలో బాగా రాణించారు.

ఈ లిస్టులో కన్నడ సూపర్ స్టార్.. రాజ్ కుమార్ అలాగే తన సోదరుడు శివ రాజ్ కుమార్ లు కూడా చేరుతారు. వీరిద్దరూ కూడా కన్నడ చిత్ర పరిశ్రమలో బాగా రాణిస్తున్నారు.

ఈ లిస్టులో చిట్టచివరగా భారతదేశంలో ఓ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కమల్ హాసన్. ఈయన సోదరుడు చారుహాసన్ కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీలో అన్నదమ్ములు వారికి తగ్గ స్థాయిలో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!