తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న నేపధ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయని, ప్రస్తుతం కంటే మరింత ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జరుగుతాయని ఆమె అన్నారు. అయితే ఏది ఎలా జరిగినా టీఆర్ఎస్ పార్టీకే మంచి జరుగుతందన్నారు. అనేక అంశాలు చర్చకు వస్తాయన్నారు. ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడనని కవిత అన్నారు.



































