ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కరోనా పుట్టినిల్లు అయిన వ్యూహన్ లో కోవిడ్-19 మృతుల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారికంగా ప్రకటించింది.. అయితే మొన్నటి వరకు వ్యూహన్ లో ప్రకటించిన మరణాలకంటే 50 శాతం అధికంగా అంటే 1290 మృతులను అదనంగా వెల్లడించారు. దీనితో ఇప్పటి వరకు చైనాలో మరణించిన వారి సంఖ్య 4,632 కు చేరింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

కరోనా విషయంలో మిగిలిన దేశాలను అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. ఈ కారణంతోనే WHO కు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు ట్రంప్. అయితే తాజాగా WHO పనితీరుపై విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా కరోనా మృతుల సంఖ్యా ఒక్కసారిగా పెంచింది. కోవిడ్-19 మృతుల సంఖ్య అమెరికా కంటే చైనాలో ఎక్కువే ఉంటుంది కానీ ఆ వాస్తవాన్ని చైనా కప్పిపుచ్చింది అని మండి పడ్డారు. కరోనా మరణాల విషయంలో చైనా దరిదాపుల్లో కూడా అమెరికా ఉండదని వ్యాఖ్యానించారు.



































