Vangalapudi Anitha : టీడీపీ మహిళా నేతగా 2014 లో తొలిసారి ఎమ్మెల్యే గా పాయకరావుపేట నియోజకవర్గం నుండి గెలిచిన వంగలపూడి అనిత తొలుత టీటీడీ సభ్యురాలిగా పనిచేసారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ మహిళా నేత తానేటి వనిత చేతుల్లో ఓడిపోయిన అనిత ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మీడియా సమావేశాల్లోను, డిబేట్స్ లో పాల్గొంటూ వైసీపీ మీద విరుచుకుపడే అనిత ఫైర్ బ్రాండు గా పేరు తెచ్చుకున్నారు. ఎపుడూ రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శలు అంటూ బిజీగా ఉండే అనితగారు తొలిసారి ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి చెప్పారు.

భర్తను కొట్టించారా…
తన మీద వైసీపీ సోషల్ మీడియా ద్వారా వంగలపూడి అనిత తన భర్తను కొట్టించి జైలుకి పంపిందని అలాగే బాగా చిత్రహింసలు పెట్టిందనే వార్తలు వ్యాపింపజేశారు అంటూ అనిత తెలిపారు. అలాంటి పుకార్లను పుట్టించిన వారు నా ముందుకు వస్తే సమాదానం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. అలా పుకార్లు పుట్టించిన వారికీ కుటుంబం ఉంటుంది, నేను వారి కుటుంబం గురించి మాట్లాడితే వారికి అపుడు అర్థమవుతుంది.

చాలాసార్లు నేను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే ఉద్దేశం తోనే నన్ను ఎంత కించపరిచేలా విమర్శలను చేసినా హద్దులో ఉండి విమర్శిస్తున్నాను కానీ దాన్ని వాళ్ళు చేతకానితనం అనుకుంటున్నారు అంటూ వివరించారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయి అలాంటివే నాకు నా భర్త శివ ప్రసాద్ కీ ఉన్నాయి. అన్నీ సర్దుకుని మేము బాగున్నానము అంటూ చెప్పారు. ఇక పిల్లల విషయానికి వస్తే ఒక బాబు ఒక పాప ఉండగా బాబు డిగ్రీ చేస్తుండగా పాప పదో తరగతి చదువుతోందని తెలిపారు. వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకుంటారని, వాళ్ళ కోసమే ఏదైనా చేసినా వాళ్లకు నచ్చక పోతే అసలు అది చేయను అంటూ చెప్పారు అనిత.


































