Connect with us

Featured

వనితా విజయ్ కుమార్ 3వ భర్త గురించి ఆమె చెప్పినవి అన్ని అబద్దలే.. ఇదిగో సాక్ష్యం..!!

Published

on

సీనియర్ నటుడు విజయ్ కుమార్ – మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ కు ఆల్ రెడీ పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమార్తెలున్నారు. నటి వనిత విజయ్ కుమార్‌ కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో 2 పెళ్ళిళ్ళు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఇంకా తన తండ్రి విజయ్ కుమార్‌ తో జరిగిన ఆస్తి గొడవల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.

ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా వివాదాస్పదమైన అంశాలతోనే ఎక్కువ గుర్తింపు సంపాదించింది. తాజాగా వనితా విజయ్ కుమార్ 3వ పెళ్ళి చేసుకుని సంచలనం సృష్టించింది. వనితా పెళ్ళాడిన 3వ భర్త పేరు పీటర్ పాల్. ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్. అయితే, ఈయనకు ఇదివరకే పెళ్ళవడంతో పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ ఇపుడు చెన్నై, వడపళని పోలీసులకు “తన నుంచి విడాకులు తీసుకోకుండానే పీటర్ పాల్ మరో పెళ్లి చేసుకున్నాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా విడివిడిగానే ఉంటున్నామని” కంప్లైంట్ ఇచ్చింది. తమిళ నటి వనితా విజయ్ కుమార్, పీటర్ పాల్ ల పెళ్లి జరిగి వారమౌతున్నా ఇప్పటికీ ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

పీటర్ మొదటి భార్య ఎలిజిబిత్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో వనిత కూడా చాలా సీరియస్ గా “ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే మొగుడు గుర్తొచ్చాడా.?” అంటూ ఘాటుగానే స్పందించింది. ఎలిజబెత్ కేవలం డబ్బులు గుంజడానికి ఈ డ్రామా ఆడుతుందని మండిపడింది వనిత విజయ్ కుమార్. ఇదిలా వుండగా.. ఇప్పుడు మరో వివాదంలో కూడా వనితా పేరే సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. తాజాగా తన 3వ భర్త పీటర్ పాల్ గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న గాసిప్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత 2 పెళ్లిళ్లు విఫలమైన తర్వాత నటి వనిత విజయకుమార్ ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ను 3వ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ పాల్ మొదటి భార్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన భర్తకు నిజంగా విడాకులు తీసుకునే ఆలోచనే లేదని వనిత నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కోసం ఆమె ఇంటిలో కొంతకాలం ఉన్న తన భర్త పీటర్ పాల్ ను లొంగదీసుకుని వనిత పెళ్ళి చేసుకుందని, తన భర్త బాగా తాగుతాడని, తరుచూ అమ్మాయిల గొడవల్లో చిక్కుకుంటాడని, తన భర్త ఏం చేసినా తాను ఇప్పటివరకూ భరించానని, ఇప్పుడందరూ నీ భర్త మరో పెళ్లి చేసుకున్నాడటగా..? అని సూటిపోటి మాటలతో ఎగతాళి చేస్తుంటే చాలా బాధగా ఉందని, ప్రస్తుతం పీటర్ పాలుకి ఎలాంటి
ఆదాయం లేదని, అందుకే కేవలం డబ్బు కోసమే ఆయన వనితను పెళ్ళి చేసుకున్నాడని, తన పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని” ఆవేదన చెందుతూ ఎలిజబెత్ చెప్పడంతో ఈ వివాదం క్రొత్త మలుపు తిరిగింది.

ఇదే విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు వనితా దగ్గర ప్రస్తావించగా.. వనిత మాత్రం తన భర్త తాగడని, మాంసాహారం కూడా తినడని చెప్పింది. పెళ్లిలో కూడా పీటర్ పాల్ తాగింది, మధ్యం కాదని ఆ వీడియోలో ఉన్నది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వనిత. లేటెస్ట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో వనిత షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లందరికీ వనిత గతంలో చెప్పినవన్ని అబద్దాలేనని తెలియడంతో షాకయ్యారు. వనితా సొంత యూట్యూబ్ ఛానెల్లో ఆమె షేర్ చేసిన వీడియోలో స్వయంగా వనితాయే వండిన చికెన్ కబాబ్ పీసును పీటర్ టేస్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడటంతో ఇప్పుడు నెటిజన్లందరూ వనితాపై విమర్శలు గుప్పిస్తూ కారాలూ.. మిరియాలు నూరుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!