సాధారణంగా కొందరు వ్యక్తులు ఎంతో ఎత్తు నుంచి బంగీ జంప్ చేయడం, గాల్లో చిన్నపాటి తాడుపై నడుస్తూ వెళ్లడం, వంటి అద్భుతమైన సాహస విన్యాసాలను చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ ఇటువంటి సాహసాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా ఇలాంటి సాహసాలను ప్రదర్శించడానికి ఎంతో అనుభవం కూడా కలిగి ఉండాలి. ఇలాంటి స్టంట్ లు చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలను కోల్పోవలసి వస్తుంది. ఇలాంటి తరహా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తాజా చాలెంజ్ ఇది. ఈ చాలెంజ్ ప్రకారం ఒక వ్యక్తి ఇద్దరు యువతులను ఎత్తుకొని నీటిలో దూకాలి. ఈ ఛాలెంజ్ లో భాగంగానే ఒక వ్యక్తి ఇద్దరు యువతులను తన నడుము పై ఎక్కించుకుని చాలా ఎత్తు నుంచి నీటితో నిండి ఉన్న ఒక క్వారీలో దూకాడు. అతడు ఈ సాహసం చేసేటప్పుడు ఏమాత్రం తేడా జరిగినా వారి ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ వారి అదృష్టం బాగుండి వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయట పడ్డారు.
ఈ స్టంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు.ఎంతో సాహసంతో కూడుకున్న ఈ స్టంట్ ఎంతో ప్రమాదకరమైనదని భావించారు. కానీ ఇలాంటి స్టంట్ లు కేవలం నిపుణుల పర్యవేక్షణలో చేస్తేనే మంచిదని కొందరు భావించగా.. మరికొందరు ఇలాంటి డేంజర్ స్టంట్ లను ఎవరు ప్రయత్నించవద్దని తెలియజేస్తున్నారు. ఏమాత్రం అనుభవం లేని వారు ఇలాంటి సాహసాలు చూసి ప్రయత్నిస్తే అది వారి ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.



























