విశ్వక్ సేన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఆయన చేసిన ఫ్రాంక్ వీడియో అని అందరికీ తెలిసిందే. చిన్న విషయం చిరిగి చాట అంత అయి చాపంత అవడం ఇదేనేమో.. అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

ఇక ఇలాంటి వివాదాలను ఏమాత్రం వదలని టీవీ9 చానల్ ఏకంగా డిబేట్ పెట్టేసారు. ఈ నేపధ్యంలో యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ పాగల్ శీను, డిప్రెషన్ పర్సన్ అంటూ అనడంతో వివాదం మరో లెవల్ కి వెళ్ళిపోయింది.. ఇక దేవి నాగవల్లి గెట్ అవుట్ అనడం.. హీరో విశ్వక్ సేన్ కూడా “F” వర్డ్ యూజ్ చేస్తూ అనుచిత వాఖ్యలు చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. అయితే జరిగిన మొత్తం ఎపిసోడ్ లో నెటిజన్లు చాలా మంది విశ్వక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు యాంకర్ దేవి నాగవల్లిపై తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇపుడు ఈ వివాదం మంత్రి వరకు వెళ్లి మరో మలుపు తిరిగింది.

ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం..
హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలంటూ టీవీ9 టీం, జర్నలిస్ట్ సంఘాలతో కలిసి యాంకర్ దేవి నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి పిర్యాదు చేసాయి. హీరో విశ్వక్ సేన్ వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదు చేసారు యాంకర్ దేవి నాగవల్లి. ఈ పిర్యాదుపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తలసాని మాట్లాడుతూ చిత్రం ప్రమోషన్స్ చేయాలనుకుంటే కొన్ని పర్మిషన్స్ తీసుకుని చేయాలి అది మానేసి రోడ్డు మీద అందరినీ డిస్టర్బ్ చేయడం అనేది సరైన పద్దతి కాదు దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడాను అని తెలిపారు మంత్రి తలసాని.
టీవీ 9 డిబెట్ గురించి మాట్లాడుతూ ఆ డిబేట్ చూశానని అందులో అతని బిహేవియర్ బాలేదని దీనిపై ప్రభుత్వం సీరియస్ గాతీసుకుంటుందని తెలిపారు తలాసాని. యాంకర్ కొన్ని పాయింట్స్ డిబేట్ లో మాట్లాడేటప్పుడు అతను మరో రకంగా సమాధానం చెప్పడం సభ్యసమాజంలో ఇది కరెక్ట్ కాదని, ముఖ్యంగా ఒక ఆడకూతురిని ఈ విధంమైన పదజాలంతో కించపరచడం అనేది కరెక్ట్ కాదని స్పష్టం చేసారు మంత్రి తలసాని. దీనిపై ఫిలిం డవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.


































