Vizag Sathya : రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు, ఎంతోమంది వర్ధమాన డాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ వంటి వారికి గురువు. ఇక ప్రభాస్ లాంటి హీరోలకు డాన్స్ శిక్షణ ఇచ్చాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో అనేక వివాదాలకు కేర్ అఫ్ అయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ వాళ్లను విమర్శిస్తూ ఫేమస్ అయ్యారు. అలాగే తన పెళ్లిళ్లతోనూ ఫేమస్ అయ్యారు. మొదటి భార్య మరణించాక రెండో పెళ్లి చేసుకున్న ఆయన ఆమె విడిగా ఉండటం వల్ల ఒంటరి అయ్యారు. ఇక మూడోసారి పెళ్లి చేసుకోకుండా లక్ష్మి అనే మహిళతో సహజీవనం చెసారు రాకేష్ మాస్టర్. ఆమె వంట చేయడానికని వచ్చి మాస్టర్ కి దగ్గరైంది. ఆమెకు భర్త లేడు, చావైనా బతుకైనా రాకేష్ మాస్టర్ తోనే అంటూ ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇక లక్ష్మి కూతురు రాజమండ్రిలో ఉండగా ఆమెకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక ఆమె గురించి ఆమె నోటి దూల గురించి వైజాగ్ సత్య తెలిపారు.

కొట్టడంలో తప్పేలేదు…
లక్ష్మికి నోటి దూల బాగా ఎక్కువ. అందరినీ నానామాటలు అనేది. అలా రాకేష్ మాస్టర్ భార్య పిల్లలను తిట్టేసరికి ఆయన లక్ష్మీని దూరం పెట్టాడు. ఆ సమయంలో నేను ఆమె ఒంటరి మహిళ అన్నట్లుగా ఆమెతో కలిసి వీడియోలను చేసేవాడిని కానీ నన్ను, మా అమ్మను కూడా తిట్టింది. ఇక లల్లి అనే యూట్యూబర్ ను బాగా తిట్టింది అలాగే ఆమె పిల్లలు చాలా చిన్నవాళ్లు వాళ్ళను కూడా తిట్టింది అందుకే ఈ రోజు ఆ లల్లి ఆమెను నడిరోడ్డులో కొట్టింది.

లల్లి భర్త లారీ ఆక్సిడెంట్ లో చనిపోతే ఆమె పిల్లలను చూసుకుంటూ డబ్బు సంపాదిస్తూ కష్టపడుతుంటే ఆమే భర్తను చంపిందని, ఆమె వ్యభిచారం చేస్తోందని, ఆమె కూతురుతో కూడా అదే చేయింస్తుందంటూ పసిపిల్లల గురించి తప్పుగా వాగింది. అందుకే లల్లి ఇక ఓపిక పట్టలేక నలుగురు మహిళలను తీసుకువచ్చి కొట్టింది అంటూ సత్య తెలిపారు.



























