Connect with us

Featured

మళ్ళీ ముదురుతున్న మెగా Vs బాలయ్య వార్ !! (అంతం కాదిది ఆరంభమంటున్న లెజెండ్)

Published

on

మెగా Vs నందమూరి వార్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. దశాబ్ధాలుగా ఈ 2 కుటుంబాల మధ్య పరిశ్రమలో అటు వృత్తిపరంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ ఆధిపత్య పోరు నడుస్తుందని తెలుసు. సంక్రాంతి సినిమా పోటీల బరిలో ఇద్దరి సినిమాలు రిలీజైతే ఇక ఇద్దరి ఫ్యాన్స్ మధ్య రగడ ఎలా వుంటుందో తెలిసిందే..!

అయితే ఈమధ్యకాలంలో సినిమా ఫంక్షన్ల వేదికలపై ఇద్దరూ స్నేహంగా కలుసుకోవడంతో గొడవలేవీ లేవనే ఫ్యాన్స్ భావించారు. కానీ అనూహ్యంగా కరోనా మమమ్మారీ లాక్ డౌన్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మెగా నందమూరిల చెలిమి కలలో మాత్రమే కానీ ఇలలో జరగదని జనాలకు అర్థమైంది. ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో ఆ ఇద్దరి మధ్యా నువ్వా నేనా? అన్నంత గొడవ మొదలైంది. కరోనా కష్ట కాలంలో సీసీసీ ట్రస్ట్ ప్రారంభించి సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నించారు. అలాగే ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో సినీపరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు నేనున్నాను అంటూ ఆయన ముందుకొచ్చారు. దాసరి తర్వాత నేనున్నాను అన్న భరోసాని కల్పించారు. అలాగే కరోనా కష్ఠకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. షూటింగుల పునప్రారంభ వ్యవహారం మొదలుగొని థియేటర్లు తెరిచే అంశం వరకూ తెలంగాణ ప్రభుత్వంతో సినీ ప్రముఖులందరూ సమావేశమై చర్చలు జరిపారు.

అయితే టాలీవుడ్ లో ఇంత ముఖ్యమైన విషయంలో చర్చలకు తనను పిలవకపోవడంతో బాలయ్య హర్ట్ అవ్వడం.. అటుపై మెగాస్టార్ పై తీవ్రమైన కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో సంచలనం మొదలైంది. “వారంతా భూములు పంచుకోవడానికే సమావేశమయ్యారంటూ” అటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలపైనా.. ఇటు చిరంజీవిపైనా బాలయ్య వివాదస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా మెగాబ్రదర్ నాగబాబు రంగంలోకి దిగి నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. “నువ్వేమీ కింగ్ వి కాదు.. కేవలం హీరోవి!!” అంటూ బాలయ్య ఇమేజ్ ను తీసిపారేసినట్టే మాట్లాడారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి కి ఇది ఆరంభమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర హీరోలు మధ్య మొదలైన ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ 2గా విడిపోయిందనే ఫీలింగ్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండగా ప్రముఖ సినీ దర్శకులు థమ్మారెడ్డి భరద్వాజ, సీనియర్ నటుడు నరేష్, దర్శకుడు తేజ ఈ వివాదంలో కలగజేసుకుని ఇంతటితో ఈ వివాదం సద్దుమణిగేలా చేయవల్సిందిగా మీడియాను కోరారు.

ఆ తరువాత ఈ వివాదం అంతటితో ముగిసిపోయిందని అందరూ అనుకుంటూ ఉండగా, జూన్ 10న బాలయ్య తన పుట్టినరోజును పురస్కరించుకొని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. అసలు చిరంజీవి, తనకు మధ్య విభేదాలు ఇప్పటివి కాదని, ఎప్పటి నుంచో ఉన్నవేనని గుర్తు చేస్తూ.. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవినే టార్గెట్ చేస్తూ బాలయ్య కొన్ని సంచలన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా టాలీవుడ్ కి సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించే 80 స్ రీయూనియన్ గురించి లెజెండ్ బాలయ్య ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన ఫంక్షన్ ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగేవని, సినీ ప్రముఖులంతా కలిసి అక్కడికి వెళ్లేవాళ్ళని, అక్కడే ఉత్సాహంగా గడిపేవాళ్ళని చెప్పారు. కానీ గత సంవత్సరం హైదరాబాదులో ఆ ఫంక్షన్ చిరంజీవి ఇంట్లో నిర్వహించారు. ఆ ఫంక్షన్ కు తనను పిలవలేదని, అందరినీ పిలిచారని, తనని మాత్రమే ఎందుకు పిలవలేదో తనకు ఇప్పటికీ తెలియదని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఎక్కడో జరిగిన ఫంక్షన్లకు నన్ను పిలిచి హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కు నన్నెందుకు పిలవలేదు.? నేనేమీ పిచ్చోడిని కాదంటూ.. ఉంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ పద్ధతిలో వుండాలి. లేకపోతే నన్ను పూర్తిగా పక్కన పెట్టాలని, అప్పుడు తన పని తాను చేసుకుపోతుంటాను అంటూ బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్నటి వరకూ బాలయ్య, చిరుల మధ్య జరిగిన వార్ ను పరిశీలిస్తే వాళ్ళిద్దరూ ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. అయితే ఈ వివాదం ఇలానే కొనసాగితే టాలీవుడ్ కు ఏమంత శ్రేయస్కరం కాదన్నది కొందరు సినీ పెద్దల అభిప్రాయం. మరి ఈ వివాదానికి పరిష్కారం ఏమిటి?  చిరు – బాలయ్య ఇప్పుడప్పుడే కలవరా? అన్న విషయం నేటికి సస్పెన్స్ గానే వుంది. చూద్దాం టాలీవుడ్ లోనే అగ్రహీరోలుగా కీర్తిగడించిన ఈ ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై కలిసి మాట్లాడుకునే శుభ తరుణం ఎప్పుడొస్తుందో..?!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!