హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు తాము అన్నం పెడితే తమకు సున్నం పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్కు దుఃఖం ఎందుకు?
ప్రజాపాలన చూస్తే కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కేసీఆర్కు దుఃఖం వచ్చిందా అని నిలదీశారు. కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రశ్న
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ఏం చేశారని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ను పార్లమెంట్కు పంపింది తామే కదా అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శించారు.



























