Connect with us

Featured

రియల్ స్టార్ శ్రీహరి చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు అసలేం జరిగింది?

Published

on

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఎలమర్రు గ్రామంలో 1964 ఆగస్టు 15 వ తేదీన జన్మించారు శ్రీహరి. అతని చిన్నతనంలోనే హైదరాబాద్ నగరానికి మకాం మార్చిన శ్రీహరి కుటుంబం బాలాజీ నగర్ లో స్థిరపడి పోయింది. శ్రీహరి మొదటగా స్టంట్ ఫైటర్ గా సినిమా లో అరంగేట్రం చేశారు. జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం పొందిన శ్రీహరి కి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ అవకాశం వచ్చింది. కొన్నేళ్ళ తర్వాత రైల్వే ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఈ రెండూ ఉద్యోగాలలో శ్రీహరి జాయిన్ అవ్వకుండా సినిమాపై ఆసక్తి తో టాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టారు. బ్రహ్మ నాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, ముఠామేస్త్రి, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 1999 వ సంవత్సరంలో పోలీస్ అనే సినిమాలో మొట్టమొదటిగా హీరోగా కనిపించిన శ్రీహరి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీహరి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో భద్రాచలం సూపర్ హిట్ గా నిలిచింది.

వయసు పైబడిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించారు శ్రీహరి. అయితే శ్రీహరి 1991 వ సంవత్సరంలో డిస్కో శాంతి అనే నటీమణి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ముగ్గురు పిల్లలు( ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె) కూడా జన్మించారు. అయితే కేవలం నాలుగు నెలల వయసులోనే అక్షర అనే పేరుగల శ్రీహరి కూతురు చనిపోయింది. దీంతో అక్షర పేరిట ఆమెను గుర్తు చేసుకుంటూ అక్షర ఫౌండేషన్ ప్రారంభించి స్కూల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు… మేడ్చల్ జిల్లాలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలాగే గ్రామాలకు ఫ్లోరైడ్ ఫ్రీ నీటిని సరఫరా చేయడం ప్రారంభించారు.

ఇకపోతే శ్రీహరి తన చిన్నతనం నుండే బాడీ బిల్డింగ్ పై బాగా ఆసక్తి పెంచుకొని రోజులో చాలా గంటల పాటు వ్యాయామం చేసేవారు. అలాగే మద్యం కూడా బాగా పుచ్చుకునేవారు. గుట్కా పాన్ వంటివి కూడా బాగా నమిలే వారు. అయితే అతని పక్కన ఒక అసిస్టెంట్ ఎప్పుడు చెంబు పట్టుకొని ఉండేవాడట. దీని అర్థం శ్రీహరి ఎప్పుడూ గుట్కా నములుతూ ఒక చెంబు నిండా ఉమ్మి వేసేవారట. అయితే ఈ చెడు అలవాట్లతో పాటు మద్యం కూడా విపరీతంగా తాగడం వలన అతని ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యింది. చాలా సందర్భాలలో శ్రీహరి నిద్ర పోకుండా మందు తాగుతూనే ఉండేవారట. అలా మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వలన అతని ఆరోగ్యంపై బాగా చెడు ప్రభావం చూపింది.

ఒకరోజు షూటింగ్ నిమిత్తం ముంబై నగరానికి వెళ్లిన శ్రీహరికి జ్వరం వచ్చింది. అయితే ముంబాయి నగరంలోనే ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పటికే అతనికి 102 జ్వరం ఉంది. ఈ విషయం అతని మేకప్ మ్యాన్ డిస్కో శాంతి కి ఫోన్ చేసి తెలిపారు. దాంతో డిస్కో శాంతి వెంటనే ముంబై నగరానికి బయలుదేరారు. ఆమె అక్కడికి వెళ్ళిన అనంతరం శ్రీహరి పరిస్థితి బాగానే ఉందని తీసుకున్నారు. ఆమెతో శ్రీహరి 12 గంటల వరకు బాగానే మాట్లాడారు. అయితే 12 గంటల వరకు బాగానే మాట్లాడిన శ్రీ హరి తర్వాత ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో డిస్కో శాంతి ఆసుపత్రి సిబ్బందిని గట్టిగా పిలిచింది. అప్పుడు నర్సులు వచ్చి శ్రీహరికి సెలైన్ పెట్టి వెళ్ళిపోయారు. మేకప్ మ్యాన్ శ్రీహరి పక్కనే కాసేపు ఉండి బయట కూర్చున్న డిస్కో శాంతి వద్దకు వచ్చి శ్రీహరి సార్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పారు. డిస్కోశాంతి అతనికి డబ్బులు ఇచ్చి ఆసుపత్రి బిల్ రూ. 7.50లక్షలు కట్టాల్సిందిగా కోరారు. అతను బిల్లు కట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత డిస్కో శాంతి శ్రీహరి ఉన్న ఆసుపత్రి రూమ్ లోకి వచ్చి చూసారు. అప్పుడు శ్రీహరి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం వరదలా పారుతుంది. ఈ ఘటన చూసిన వెంటనే భయపడి గట్టిగా అరవడం ప్రారంభించారు శాంతి.

అంతలోనే ఆసుపత్రి సిబ్బంది శ్రీహరి దగ్గరికి వచ్చి అతని పరిస్థితి ఏమీ బాగోలేదు అని చెప్పారు. దీంతో వెంటనే తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారి సహాయంతో ఇతర హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే శ్రీహరి చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని డిస్కో శాంతికి చెప్పి కంట తడిపెట్టుకున్నారు. దీంతో ఆమె గుండెలు బాదుకుంటూ రోధించారు. శ్రీహరి చనిపోయారని తెలుసుకున్న చాలా మంది తెలుగువారు ముంబాయి నగరానికి తరలి వచ్చారు. అప్పుడే ముంబై ఆసుపత్రి డాక్టర్లకు శ్రీహరి అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని సినీ నటుడు అని అర్థమయింది. శ్రీహరి గురించి తలుచుకుంటూ ఇప్పటికీ తన జీవితాన్ని ఒంటరిగా సాగిస్తున్నారు శాంతి. ఏది ఏమైనా ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన శ్రీహరి. కేవలం నలభై తొమ్మిది సంవత్సరాలకే చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో అతని మరణం ఒక పీడకల లాగా అందరూ భావించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!