కరోనా గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహామ్మరిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరిచ్స్తూనే ఉంది.

ఈ నేపధ్యంలో తాజగా ప్రజలందరికి పాటించాల్సిన జాగ్రత్తలతో పాటు పలు సూచనలు చేసారు. ఈ కరోనా కరోనా సమయంలో మన తీసుకునే ఆహరం విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిందేనని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇందులో భాగంగా ఐదు ఆహార సూచనలు చేసింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వంట చేసేప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. పచ్చివి మరియు వండిన ఆహార పదార్ధాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి. ఆహారాన్ని బాగా ఉడికించాలి. వండిన పదార్ధాలను సురక్షితంగా ఉష్ణోగ్రతల్లో ఉంచాలి. శుభ్రమైన నీళ్ళు, పరిశుభ్రమైన ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకోవాలి.

































