రాజా రఘువంశీ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా కేసు దర్యాప్తులో సంజయ్ వర్మ అనే పేరు తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది. హత్య కేసులో నిందితురాలైన సోనమ్ ఫోన్ నుంచి లభించిన ఆధారాల ప్రకారం, ఈ సంజయ్ వర్మ ఎవరన్న దానిపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే మేఘాలయ పోలీసులు ఆ పేరును ఎత్తుగడగా తప్పుదారి పట్టించడానికి ఉపయోగించినట్లు వెల్లడించారు.

సోనమ్ ఫోన్లో రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని సంజయ్ వర్మగా సేవ్ చేసుకుందని స్పష్టమైంది. అసలు విషయం ఏంటంటే, రాజ్ కుష్వాహా సోనమ్ ప్రియుడు. పెళ్లికి ముందు 39 రోజుల్లో ఆ నంబర్కు 234 సార్లు ఫోన్ చేసి, ప్రతిరోజూ కనీసం 30 నుంచి 60 నిమిషాలు మాట్లాడిన రికార్డులు దొరికాయి. అంటే ఈ హత్య ఉద్దేశ్యపూర్వకంగా జరిగినదే అని మరోసారి తేలిపోయింది.
మే 11న రాజా రఘువంశీ, సోనమ్ వివాహం జరిగింది, కేవలం నెల రోజుల వ్యవధిలోనే జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ కేసులో సోనమ్తో పాటు మరో నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిలో రాజ్ కుష్వాహా ప్రధాన పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ మొత్తం ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే, భర్తను పెళ్లి అయిన నెల రోజులోనే హత్య చేయడం, అది కూడా ప్రణాళికాబద్ధంగా మరొక ప్రియుడితో కలిసి చేయడం, భారతదేశం మొత్తాన్ని కుదిపేసే మానసిక స్థితిని చూపిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంజయ్ వర్మ మిస్టరీ ఈ కేసును మరింత మలుపు తిప్పింది.































