క్షణికావేశంలో ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు నేటి తరం. చిన్న చిన్న విషయాలకే అర్ధం లేని కోపం తెచ్చుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఘటనలు చాలా చూస్తూనే ఉన్నాం. అంటువంటి అమానుషమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలో జరిగింది. తన భర్త మీద కోపంతో చేతిలో ఉన్న ఆరు నెలల కూతురిని విసిరి కొట్టింది ఈ తల్లి.. తీవ్రంగా రక్తం పోవడంతో మృతి చెందింది ఆరునెలల పసికందు.

ఆగ్రాలోని ఆలీఘడ్ ప్రాంతంలో రాంపూర్ గ్రామానికి చెందిన రాహుల్ శర్మ, పింకీ శర్మ లు భార్యాభర్తలు. వీరిద్దరికి మూడేళ్ళ క్రితమే పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల బాబు మరియు ఆరునెలల పాప ఉన్నారు.. ఆ పాప పేరు సోని. అయితే హొలీ పండుగ దగ్గర్లో ఉండటంలో తన భర్తను షాపింగ్ కు తీసుకెళ్లామని అడిగినది పింకీ శర్మ.. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని, మరోసారి వెళదామని ఆమెకు చెప్పాడు రాహుల్ శర్మ.. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో కోపంతో ఉగిపోయిన పింకీ శర్మ తన చేతుల్లో ఉన్న ఆరునెలల పాప సోనిను విసిరి కొట్టింది. దీనితో తీవ్ర గాయాలై రక్తం పోవడంతో ఆ పాప కొద్దిసేపటికే మృతి చెందింది. అయితే పింకీ, రాహుల్ శర్మల మద్య తరచూ గొడవలు జరుగుతుండేవని, అదే తరహాలో మరోసారి గొడవ జరగడమే కోపం అదుపుచేసుకోలేక కన్న కూతురిని కడతెరిచిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిపై ఆమె కుటుంభం సభ్యులు పోలీసుస్టేషన్లో కేసు పెట్టగా.. పోలీసులు హత్యానేరం కింద అరెస్ట్ చేసి జైలుకి పంపారు.



























