కరోనాను అంతమొందిచేందుకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు పేరుతో వైఎస్ఆర్ పార్టీ దొంగ వ్యాపారం చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాజగా మాజీ మంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే..

ఈ నేపధ్యంలో అచ్చేన్నాయుడు మాట్లాడుతూ ఆనందయ్య మందుతో వైకాపా దొంగ వ్యాపారం చేస్తుందని, ఈ కుట్ర బయటపెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జీరి, చోరీ కేసులు పెడతారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతిపరుల్నీ ప్రోత్సహించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ పాలన కొనసాగిస్తోందని అన్నారు. బెదిరించిన వాళ్లకు, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా అని ఆయన నిలదీశారు.





























