YCP leader Ambati Rambabu : అంబటి రాంబాబు రాజకీయాలు ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితులు. ఆయన వైసీపీ మౌత్ పీస్, మైక్ పట్టుకున్నారంటే మాట్లాడుతూనే ఉంటారు అనర్గళంగా. ఆయన ప్రత్యర్థి పార్టీ మీద విరుచుకుపడి విమర్శలను చేస్తుంటారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ జనసేన నువ్వా నేనా అన్నట్లుగా తిట్టుకుంటూ సోషల్ మీడియాలో నానుతున్నారు. అయితే వైసీపీ నాయకులకు కౌంటర్ ఎటాక్ గా పవన్ చెప్పు చూపించడం, దీనికి వైసీపీ వాళ్ళు కౌంటర్లివ్వడం చూసాం. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి గారు ఈ ఇష్యూ మీద విరుచుకుపడ్డారు.

పవన్ చెప్పు చూపిస్తావా… నిన్ను కొట్టేవాళ్ళు లేరనుకున్నావా…
పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి అంబటి గారు మాట్లాడుతూ ఆయనకి అసలు క్లారిటీ ఉందా అంటూ విమర్శించారు. ఓసారి బీజేపీతో కలిసుంటా అంటాడు, మరోసారి టీడీపీ తో జాతకడతాను అంటాడు. ఎటు వైపు ఉన్నాడో ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తాడా అనే విషయం ఇప్పటివరకు జనాలకు క్లారిటీ లేదు. ఇక అతను మాట్లాడే భాష ఒక నాయకుడు మాట్లాడదగినదా అసలు అంటూ విరుచుకుపడ్డారు. చెప్పుతో కొడతా అంటూ చెప్పు చూపించారు. ఒక సీఎం కావాలనుకున్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలా అవి అంటూ రాజకీయాల్లో భాష సరిగా ఉండాలి అంటూ హితవు పలికారు.

ఇక సీఎం జగన్ ఆయన చెల్లి మధ్య విబేధాల గురించి మాట్లాడుతూ వారి మధ్య ఎలాంటి బేధభిప్రాయాలూ లేవు. ఇద్దరూ పెద్దవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి రాజకీయా అభిరుచి వారిది. షర్మిల గారికి రాజకీయాల మీద ఇష్టం ఉంది అందుకే తెలంగాణ రాజకీయాలలో ఉన్నారు అంటూ లేనిపోనివి ప్రతిపక్ష పార్టీలు కల్పించడం తప్ప వాళ్ళకేమి బేధాభిప్రాయాలు లేవని చెప్పారు.


































