Political News

YS Jagan: అలాంటి చర్యలకు పాల్పడితే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా: వైయస్ జగన్

YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అదానీ ముడుపుల వ్యవహారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమినేతలు అలాగే ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న క్రమంలో ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..FBI చార్జ్ షీట్లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.అదానీ మన రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనతో భేటీకి విద్యుత్ ఒప్పందానికి ఏ మాత్రం సంబంధం లేదని జగన్ తెలిపారు. నాకు లంచం ఇచ్చినట్టు చాలామంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఈయన ప్రశ్నించారు.

ఇలా వాస్తవాలు తెలియకుండా కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారాలను చేస్తూ నా పేరు ప్రతిష్టలకు పరువుకు భంగం కలిగేలా చేస్తున్నారు ఇకపై ఎవరైనా నా పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా కనుక మాట్లాడితే తప్పనిసరిగా వారిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

YS Jagan:పరువు నష్టం దావా..

ఇకపోతే ఈయన చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా తన చెల్లి షర్మిలను ఉద్దేశించి చేశారని తెలుస్తుంది.అదానీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని తనని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే జగన్ ఇలా స్పందించారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

2 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

4 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

4 hours ago

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…

6 hours ago

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…

6 hours ago