శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని మీడియా ప్రశ్నించగా మాజీ మంత్రి చిదంబరం మీడియా తో మాట్లాడుతూ.. బడ్జెట్ లో పేర్కొన్న లెక్కలకు, ఖర్చులకు అసలు పోలిక లేదని, అసలు 20-21 బడ్జెట్ లక్ష్యం ఏమిటో ఆర్ధికమంత్రి చెప్పలేదని, మొత్తానికి ఇది ఒక అంకెల గారడీ మాత్రమే అని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుందని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ వాళ్ళ ఒరిగేది ఏమి లేదని తేల్చి చెప్పారు చిదంబరం. ఇకపోతే ఎల్ఐసి వాటాల విక్రయాన్ని చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. స్టాక్ మార్కెట్లోకి ఎల్ఐసి లిస్టింగ్స్ తీసుకురావద్దని అన్నారు చిదంబరం.
దేశంలోని సమస్యలకు బడ్జెట్ ఏవిధమైన పరిష్కారం చూపలేదని చెప్పారు చిదంబరం. దీనిపై మా పార్టీలో చర్చ జరుగుతుందని అన్నారు చిదంబరం. మొత్తానికి ఈ 20-21 బడ్జెట్ ఒక అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా అసలు లేదని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి. అసలు బడ్జెట్ లక్ష్యం లేకుండా బడ్జెట్ ఏమిటని ప్రశ్నించారు.






























