తెలంగాణ రాష్ట్రంలో జులై 1నుంచి పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు హాజరు కావాలా? పాఠశాలల్లో భౌతికదూరం అమలు కష్టం’’ అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ వివరణ ఇస్తూ.. ‘‘మూడ్రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తాం.

విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్లైన్ బోధన ఉంటుంది. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి’’ అని చెప్పింది. వారంలో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది.































