ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు వంటి హేమాహేమీలు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న తరుణంలో 1960వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. శోభన్ బాబు ఫ్యామిలీ టైప్ సినిమాలు చేస్తున్నాప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ మాత్రం కౌబాయ్ (మోసగాళ్లకు మోసగాడు) జేమ్స్ బాండ్ (గూడచారి 116) క్రైమ్ థ్రిల్లర్(అవేకళ్ళు) వంటి సినిమాలతో కొత్త ప్రభంజనాన్ని తెలుగు సినీ పరిశ్రమలో సృష్టించడం జరిగింది. ఈ ప్రభంజనం ఇలా కొనసాగుతున్న క్రమంలో అటు ఇటు గా 1980 దశకంలో వచ్చిన చిరంజీవి తన డాన్స్ ఫైట్లతో (ఖైదీ, పసివాడి ప్రాణం) తెలుగు సినీ పరిశ్రమ గమనాన్ని మార్చారు.

ఇద్దరు హేమాహేమీలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందని దర్శకుడు కె.వాసు ఆలోచించారు.అలా వీరు ఇద్దరూ తోడు దొంగలుగా వచ్చి బాక్సాఫీసును కొల్లగొట్టారు.1981 కె.వాసు దర్శకత్వంలో వచ్చిన తోడు దొంగలు చిత్రంలో కృష్ణ, చిరంజీవి, గీతా, మధుమాలిని, హీరో, హీరోయిన్లుగా నటించారు. కృష్ణ (కృష్ణ) కిషోర్ (చిరంజీవి) వీరిద్దరూ తోడు దొంగలు. వీరు జీవనోపాధికి కష్టపడి పని చేయకుండా దొంగతనాలు చేసి జీవిస్తుంటారు. ఆ క్రమంలో ఒక బార్ లో గొడవ చేయడం, ఆ గొడవ సద్దుమణిగేలా కృష్ణ వెళ్లి బేరసారాలు చేయడం లాంటివి చేస్తుంటారు. అలాగే నకిలీ ప్రమాదాన్ని సృష్టించడం దాన్ని ఆధారంగా చేసుకుని డబ్బులు గుంజడం లాంటివి చేస్తూ.. తమ దొంగతన కార్యక్రమాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తుంటారు.

అనుకోకుండా కిషోర్(చిరంజీవి) గీత ప్రేమలో పడతాడు. అలాగే కృష్ణ కూడా మధు మాలిని ఇష్టపడతాడు. దుష్ట పాత్రలో రావు గోపాల్ రావు, అతిధి పాత్రలో సత్యనారాయణ, కాంతారావు ప్రభాకర్ రెడ్డి వంటి నటులు ఇందులో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాకి సత్యం సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. 1981 లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాన్ని చవిచూసింది.సూపర్ స్టార్ కు మెగాస్టార్ కు ఈ సినిమా ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉండిపోయింది.































