Connect with us

Featured

పచ్చని చెట్ల నుంచి తెల్లని కాగితం ఎలా తయారు చేస్తారో తెలుసా?

Published

on

నానా చెత్త చెదారం రాసి పడెయ్యడానికి కూడా కాగితమే కావాల్సి వస్తోంది కదా..!! ప్చ్ ..

పిల్లలూ… స్కూల్లో రాసుకోవాలన్నా, ఇంటికి వచ్చి హోంవర్క్‌ చేసుకోవాలన్నా నోటు పుస్తకాలు ఉండాల్సిందే. మరి మీరు రాసుకునే తెల్లటి పుస్తకాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా..?

Advertisement

అయితే ఈ ఆకుపచ్చని చెట్ల నుంచి తెల్లని కాగితం ఎలా వస్తుందబ్బా..! అని ఆశ్చర్యంగా ఉంటుంది. 

పాపం కాగితం చెట్లనుంచి వస్తుంది. పెద్ద పెద్ద చెట్లున్న చిక్కని అడవులు గల కెనడా, స్వీడన్, ఫిన్లాండ్ లలోనే ఎక్కువగా పేపర్ మిల్లులు వున్నాయి.

కొత్తగా చెట్టు నరికి పడేసేటప్పుడు ముందుగా వాటి తోలు.. అంటే బెరడు వలిచేస్తారు. ఆపై చిన్న చిన్న కొమ్మలు, ఆకులు నరికేస్తారు. ఆవిధంగా మిల్లులకు సరఫరా చేయడానికి చెట్టుని సిద్ధం చేస్తారు.

Advertisement

చెట్ల మొదళ్ళను, కాండాన్ని ముక్కలు ముక్కలుగా చిన్నవిగా యంత్రాల సహాయంతో తరిగివేస్తారు. వాటికి నీరు, కొన్ని రసాయనాలు చేర్చి యంత్రాల్లో పెద్ద పెద్ద ముద్దలుగా చేస్తారు.

ఈ కొయ్య ముద్దలో మట్టి తదితర మలినాలను పోగొట్టి, రసాయనాల సహాయం తో చెట్ల నుండి వచ్చిన గోధుమ రంగును పోగొట్టి మెత్తగా పల్చగా కాగితాలు తయారు చేసి వాటిలో తేమ పోగొడతారు.

దీన్ని వేరే కర్మాగారంలో నీళ్లతో కలిపి ఉడికించి ద్రవరూపంలోకి మారుస్తారు. ఆ ద్రవం యంత్రాల్లో కాలువలా ప్రవహిస్తుంటుంది. దాన్ని వేడితో ఆవిరి చేస్తూ పైన గుండ్రటి బరువైన ఇనుప రాడ్లలాంటివాటితో చదును చేస్తూ పల్చటిగా ఉండే నన్ను(కాగితం) తయారు చేస్తారు. పెద్ద పెద్ద బండిళ్లుగా చుట్టి విక్రయిస్తారు.

Advertisement

మీరు వాడుకునే టెక్స్ట్‌బుక్‌లు, నోట్‌బుక్‌లు తయారు చేసే ఫ్యాక్టరీల వాళ్లు, పత్రికల వాళ్లు ఈ బండిళ్లను కొనుక్కుంటారు.  తర్వాతే వాళ్ళకు కావల్సిన సైజుల్లో మమ్మల్ని కత్తిరించి, ముద్రణలు చేసుకుంటారు. బైండింగులూ చేస్తారు.

ఒకటన్ను కాగితాన్ని రీసైకిల్‌ చేస్తే పదిహేడు చెట్లను కాపాడినట్లే. క పైన్‌ చెట్టు నుంచి 80,500 కాగితపు షీట్లు తయారవుతాయి.భూమి మీద సాగుచేసే కలపలో 42శాతం కాగితం తయారీకే వాడతారు.వాడేసిన కాగితాల్ని రీసైకిల్‌ చేసి మళ్లీ దాన్ని కాగితంగా మారుస్తారని మీకు తెలుసా? ఆ కాగితాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దానికి నీటిని కలిపి ఉడకబెడతారు. ముద్రణలు పోయేట్టు డీఇంక్‌ చేస్తారు. దానిలో రసాయనాలు కలిపి తెల్లటి ద్రవాన్ని తయారు చేస్తారు. దాన్ని కాగితంగా మారుస్తారు.
ఇదీ కాగితం తయారీ వెనుక ఉన్న రహస్యం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!