పేదలకు ఇళ్ల స్థలాల కోసం విశాఖపట్నంలో భూసమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం పది మండలాలలో 6116. ఎకరాలను తీసుకోవాలని ప్రభుతం అధికారులను ఆదేశించింది. సబ్బవరం, అనకాపల్లి, భీముని పట్నం, ఆనందపురం,పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, పెదగంట్యాడ, విశాఖ గ్రామీణ మండలాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్నారు. దేనికోసం ప్రత్యేక ప్యాకేజి కూడా సిద్ధం చేసింది. అయితే భూసమీకరణలో భాగంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములనే సమీకరించాలని నిర్ణయించారు. అసైన్డ్ భూమి కలిగి ఉన్న వారికీ పరిహారం చెల్లిస్తారు. ఒక ఎకరం అసైన్డ్ భూమి ఇస్తే అందుకు 900 గజాలు డెవలప్ చేసిన భూమిని తిరిగిస్తారు.
ఉగాది సందర్భంగా 25 లక్షల పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీకోసం వైసీపీ ప్రభుతం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములు కేటాయించడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు తమ అధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములు లాక్కునే పనిలో వున్నారు.































